
గత కొంత కాలంగా యూజర్లను ఆకట్టుకోవడంలో వోడాఫోన్ ఐడియా వెనకబడింది. ఇదే సమయంలో ఎయిర్ టెల్, జియో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో వొడాఫోన్ ఐడియా అదిరే ఆఫర్ను తీసుకొచ్చింది. ఇప్పుడు వీఐ యూజర్లు కేవలం రూ.1కే రూ. 4,999 విలువైన రీఛార్జ్ ప్లాన్ను పొందవచ్చు. ఈ అద్భుతమైన ఆఫర్ వీఐ గేమ్లలోని ‘గెలాక్సీ షూటర్స్ ఫ్రీడమ్ ఫెస్ట్ ఎడిషన్’లో భాగంగా అందుబాటులో ఉంది.
ఆగస్టు 31 వరకు మాత్రమే!
వీఐ గేమ్స్ అనేది ఈ టెలికాం సంస్థ యొక్క ప్రసిద్ధ ఆన్లైన్ క్లౌడ్ గేమింగ్ ప్లాట్ఫామ్. వీఐ గేమ్ ప్లాట్ఫామ్పై జరుగుతున్న ఈ ప్రత్యేక ఫెస్ట్ ఆగస్టు 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఫెస్ట్లో పాల్గొనే వినియోగదారులకు అనేక బహుమతులు లభిస్తున్నాయి. వాటిలో అత్యంత ముఖ్యమైనది రూ. 4,999 విలువైన వార్షిక ప్లాన్. ఈ ప్లాన్ను కేవలం రూ. 1కే గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది.
వ్యాలిడిటీ: ఈ ప్లాన్ పూర్తి 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.
డేటా: రోజుకు 2జీబీ మొబైల్ డేటా, అన్లిమిటెడ్ 5జీ డేటా లభిస్తుంది.
కాలింగ్ – ఎస్ఎంఎస్: అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లు లభిస్తాయి.
అదనపు ప్రయోజనాలు: రాత్రి 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు అన్లిమిటెడ్ డేటా, వారాంతపు డేటా రోల్ఓవర్, ViMTV, అమెజాన్ ప్రైమ్ ఉచిత సబ్స్క్రిప్షన్లు కూడా ఈ ప్లాన్లో అందుబాటులో ఉన్నాయి.
ఈ ప్లాన్తో పాటు ఈ ఫెస్ట్ సందర్భంగా మరిన్ని ఆసక్తికరమైన బహుమతులు కూడా అందుబాటులో ఉన్ాయి.
10జీబీ డేటాతో పాటు 16 OTT ప్లాట్ఫామ్లకు సబ్స్క్రిప్షన్
28 రోజులకు 50జీబీ డేటా ప్యాక్
అమెజాన్ గిఫ్ట్ కూపన్లు.
ప్రస్తుతం జియో, ఎయిర్టెల్ వంటి కంపెనీలు కొన్ని ప్లాన్లను నిలిపివేస్తున్న తరుణంలో వీఐ యొక్క ఈ వ్యూహం ఆ రెండు కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఆఫర్ వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా, చౌకగా ఉండనుందని చెప్పవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..