రూ.60 వేల పెట్టుబడితో ప్రతి నెలా రూ.14.5 లక్షల వడ్డీ! నమ్మలేని నిజం ఇది!
ఒక స్టాక్ మార్కెట్ ట్రేడర్ పంచుకున్న కథ ఇప్పుడు వైరల్ అవుతోంది. 1990లో రూ.60,000తో కొన్న నాలుగు ఎకరాల భూమి, కాలక్రమేణా రూ.25 కోట్లుగా మారింది. డీమార్ట్ రెండు ఎకరాలను కొనుగోలు చేయగా, మిగిలిన భూమి అలాగే ఉంది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో పన్నులు, అదృష్టం వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నాయి.

భూమి కొనుగోలు దీర్ఘకాలిక పెట్టుబడిగా ఎంత లాభదాయకంగా మారవచ్చో చూపించే ఒక ఆసక్తికర కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్టాక్ మార్కెట్ ట్రేడర్ అయిన స్వప్నిల్ కొమ్మవర్ షేర్ చేసిన పోస్టులో తన మామ చేసిన భూమి పెట్టుబడి గురించి వివరించారు. ఈ కథ ఎక్స్లో విస్తృతంగా చర్చకు దారితీసింది. కొమ్మవర్ తెలిపిన వివరాల ప్రకారం.. 1990 ప్రాంతంలో ఆయన మామ తన స్వస్థలంలో నాలుగు ఎకరాల భూమిని ఎకరానికి రూ.15,000 చొప్పున కొనుగోలు చేశాడు. అంటే మొత్తం పెట్టుబడి కేవలం రూ.60,000 మాత్రమే. కాలక్రమేణా ఆ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందడంతో పాటు తరువాత అది జిల్లా కేంద్రంగా కూడా మారింది.
ఈ అభివృద్ధి కారణంగా ఆ భూమి విలువ భారీగా పెరిగింది. చివరకు రిటైల్ రంగంలోని ప్రముఖ సంస్థ డీమార్ట్ ఆ భూమిలోని రెండు ఎకరాలను రూ.25 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో చిన్న పెట్టుబడి భారీ సంపదగా మారిన ఉదాహరణగా ఈ ఘటన నిలిచింది. భూమి అమ్మకంతో వచ్చిన రూ.25 కోట్లను ఆయన మామ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్గా పెట్టినట్లు తెలిపాడు. దాంతో నెలకు సుమారు రూ.14.5 లక్షల వరకు వడ్డీ ఆదాయం వస్తోంది. అదే సమయంలో మిగిలిన రెండు ఎకరాల భూమి ఇంకా ఆయన వద్దే ఉంది.
A true story from my hometown!
In 1990, my uncle bought 4 acres of land for 15,000 per acre.
Total investment: 60,000. The town developed over the years. and now even a district.
Now, DMart bought 2 acres of that land from him for 25 crores.
He has now put the 25 crores in a…
— Swapnil Kommawar (@KommawarSwapnil) March 12, 2026
కొమ్మవర్ తన పోస్టులో కొన్ని సందర్భాల్లో సరైన ఆస్తిని దీర్ఘకాలం పాటు ఓపికగా ఉంచుకుంటే పెద్ద సంపద సృష్టించవచ్చని పేర్కొన్నారు. కొన్నిసార్లు దశాబ్దాల పాటు సరైన ఆస్తిని పట్టుకుని ఉండటం వల్లే పెద్ద సంపద ఏర్పడుతుంది అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కథ వైరల్ కావడంతో సోషల్ మీడియా వినియోగదారులు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు రూ.60 వేల పెట్టుబడి రూ.25 కోట్లుగా మారడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించగా, మరికొందరు ప్రతి భూమి ఇంత విలువ పెరగదు, ఇది ప్రాంతం, అదృష్టంపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ఇంకొంతమంది ఈ పెట్టుబడిపై పన్నులు ఎలా ఉంటాయనే అంశాన్ని కూడా ప్రస్తావించారు. ముఖ్యంగా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గేయిన్ ట్యాక్స్ (ఎల్టీసీజీ) ఎంత చెల్లించాల్సి వచ్చిందో, అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీపై ఆదాయపు పన్ను, టీడీఎస్ వర్తించే అంశాలపై ప్రశ్నలు లేవనెత్తారు. ఈ ఉదాహరణ దీర్ఘకాలిక పెట్టుబడిలో ఓపిక, సరైన నిర్ణయం ఎంత కీలకమో చూపించే కథగా సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
