రిలయన్స్ జియోకు మరో భారీ ‘తాయిలం’

| Edited By: Pardhasaradhi Peri

May 04, 2020 | 4:46 PM

ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ కి మరో భారీ తాయిలం లభించింది. యుఎస్ లోని ప్రైవేట్ ఈక్విటీ సంస్థ.. సిల్వర్ లేక్.. రిలయన్స్ జియోలో రూ. 5,656 రకోట్లు (746.74 మిలియన్ డాలర్లు) పెట్టుబడి పెడతామని ప్రకటించింది. దీని విలువ రూ. 4.90 లక్షల  కోట్లు. రెగ్యులేటరీ, ఇతర కస్టమరీ అప్రూవల్ కు లోబడి ఈ డీల్ ఉంటుంది. జియో ప్లాట్ ఫామ్స్ లో 9.99 శాతం వాటా కొనుగోలుకోసం రూ. 43,574 కోట్లను ఇన్వెస్ట్ […]

రిలయన్స్ జియోకు మరో భారీ తాయిలం
Follow us on

ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ కి మరో భారీ తాయిలం లభించింది. యుఎస్ లోని ప్రైవేట్ ఈక్విటీ సంస్థ.. సిల్వర్ లేక్.. రిలయన్స్ జియోలో రూ. 5,656 రకోట్లు (746.74 మిలియన్ డాలర్లు) పెట్టుబడి పెడతామని ప్రకటించింది. దీని విలువ రూ. 4.90 లక్షల  కోట్లు. రెగ్యులేటరీ, ఇతర కస్టమరీ అప్రూవల్ కు లోబడి ఈ డీల్ ఉంటుంది. జియో ప్లాట్ ఫామ్స్ లో 9.99 శాతం వాటా కొనుగోలుకోసం రూ. 43,574 కోట్లను ఇన్వెస్ట్ చేస్తామని ఇటీవలే ఫేస్ బుక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. (ఈ డీల్ లో జియో ఇన్ ఫో కామ్, న్యూస్, మూవీ, మ్యూజిక్ యాప్, ఇతర బిజినెస్ లు కూడా చేరి ఉన్నాయి). భారతీయుల ప్రయోజనాలకోసం ఇండియన్ డిజిటల్ ఎకో సిస్టం ను మరింత అభివృధ్ది చేసేందుకు సిల్వర్ లేక్ సంస్థను తమ భాగస్వామిగా ఆహ్వానించడం తమకెంతో సంతోషంగా ఉందని ముకేశ్ అంబానీ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా లీడింగ్ టెక్నాలజీ కంపెనీలకు ఈ సంస్థ అమూల్యమైన పార్ట్ నర్ అని ఆయన పేర్కొన్నారు. కాగా-ఈ ఒప్పందంపై సిల్వర్ లేక్… కో-సీఈఓ, మేనేజింగ్ పార్ట్ నర్ ఎగాన్ డర్బన్ మాట్లాడుతూ.. వరల్డ్ లోని అత్యుత్తమ కంపెనీల్లో జియో ప్లాట్ ఫామ్స్ ఒకటని, ముకేశ్ అంబానీ తమ భాగస్వామి కావడం తమకెంతో గౌరవప్రదమని పేర్కొన్నారు.