Car Offers: కొత్త కారు కొనేవారికి బంపర్‌ ఆఫర్‌.. ఏకంగా రూ.2.50 లక్షలకుపైగా వరకు తగ్గింపు..!

|

Sep 14, 2021 | 10:33 AM

Car Offers: పండగ సీజన్‌ ప్రారంభమైంది. చాలా మంది కొత్త కార్లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతుంటారు. కార్లపై బ్యాంకులు, ఇతర సంస్థలు లోన్స్‌ ఇస్తుండటంతో..

Car Offers: కొత్త కారు కొనేవారికి బంపర్‌ ఆఫర్‌.. ఏకంగా రూ.2.50 లక్షలకుపైగా వరకు తగ్గింపు..!
Follow us on

Car Offers: పండగ సీజన్‌ ప్రారంభమైంది. చాలా మంది కొత్త కార్లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతుంటారు. కార్లపై బ్యాంకులు, ఇతర సంస్థలు లోన్స్‌ ఇస్తుండటంతో చాలా మంది కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. అంతేకాకుండా వివిధ కార్ల తయారీ కంపెనీలు కూడా కస్టమర్లకు ఎన్నో ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. కారు కొనుగోలుపై క్యాష్‌బ్యాక్‌, ఇతర ఆఫర్లను ప్రకటిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. అయితే మీకో అదిరిపోయే ఆఫర్‌ అందిస్తోంది ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మహీంద్ర. ఈ ఆఫర్‌ వల్ల భారీ తగ్గింపు లభిస్తోంది. ఏకంగా రూ.లక్షల్లో తగ్గింపు ప్రయోజనాలు పొందవచ్చు. మహీంద్రా ఎక్స్‌యూవీ500 కారుపై రూ.2.56 లక్షల వరకు తగ్గింపు పొదంవచ్చు. క్యాష్ డిస్కౌంట్ కింద రూ.1.79 లక్షల వరకు, కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ.6500 వరకు, ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ.50 వేల వరకు తగ్గింపు ప్రయోజనాలు పొందవచ్చు. ఇంకా రూ.20 వేల విలువైన యాక్ససిరీస్ ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. అలాగే మహీంద్రా ఎక్స్‌యూవీ 300 కారుపై తగ్గింపు ఆఫర్లు ఉన్నాయి. రూ.15 వేల వరకు క్యాష్ డిస్కౌంట్ అందిస్తోంది. అంతేకాదు.. రూ.4 వేల వరకు కార్పొరేట్ డిస్కౌంట్, రూ.20 వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్ వంటివి పొందొచ్చు. రూ.5 వేల ఉచిత యాక్ససిరీస్‌ కూడా లభిస్తాయి.

మహీంద్రా స్కార్పియో కారుపై..

అలాగే మహీంద్రా స్కార్పియో కారుపై డిస్కౌంట్లు ఉన్నాయి. కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ.4 వేల వరకు బెనిఫిట్ పొందొచ్చు. అలాగే రూ.15 వేల వరకు విలువైన ఉచిత యాక్ససిరీస్ పొందొచ్చు. ఆఫర్ అనేది కారు వేరియంట్, ప్రాంతం, డీలర్‌షిప్ ప్రాతిపదికన మారుతూ ఉండవచ్చు. ఈ ఆఫర్‌ ఈనెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

కాగా, మహీంద్రా కంపెనీయే కాకుండా ఇతర కార్ల తయారీ కంపెనీలు కూడా రకరకాల ఆఫర్లు అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. క్యాష్‌బ్యాక్‌, డిస్కౌంట్‌, ఎక్స్చేంజ్ ఆఫర్‌, బోనస్ తదితర ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాదికిపై అమ్మకాలు తగ్గిపోగా, ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో అమ్మకాలు జోరందుకునేలా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి వివిధ కార్ల కంపెనీలు. కొత్తగా కారు కొనాలనుకునేవారికి ఇది మంచి అవకాశం.

ఇవీ కూడా చదవండి: India Post: సీనియర్‌ సిటిజన్స్‌కు గుడ్‌న్యూస్‌.. పోస్టాఫీసుకు వెళ్లకుండా కుటుంబ సభ్యులు ఈ పనులు చేయవచ్చు

Vodafone Idea: వోడాఫోన్‌ ఐడియాకు ఐటీశాఖ భారీ షాక్‌.. కస్టమర్‌కు రూ. 27 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశం