Gold Price: మహిళలకు షాకిచ్చిన పసిడి.. రూ.1200 పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే..

Gold Price: ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో భారతదేశంలో బంగారం డిమాండ్ బాగా తగ్గింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) తాజా నివేదిక ప్రకారం, మొత్తం బంగారం డిమాండ్ 16 శాతం తగ్గి 209.4 టన్నులకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో..

Gold Price: మహిళలకు షాకిచ్చిన పసిడి.. రూ.1200 పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే..

Updated on: Oct 31, 2025 | 9:47 AM

Gold Price: గత ఐదారు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. ఈ రోజు ఉదయం నిలకడగా ఉన్న పసిడి ధరలు.. 9 గంటల సమయానికి తులం బంగారం ధరపై ఏకంగా రూ.1200 వరకు ఎగబాకింది. అలాగే వెండి ధరల్లో ఏ మాత్రం మార్పులేదు. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,680 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,12,450 వద్ద కొనసాగుతోంది. అయితే దేశీయంగా కిలో వెండి ధర రూ.1,51,000 ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో తులం బంగారం ధర రూ.1,22,680 ఉండగా, కిలో వెండి ధర రూ.1,65,000 ఉంది.

ఇది కూడా చదవండి: Petrol Price Hike: భారత్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరగనున్నాయా? కారణం ఏంటి?

ఇదిలా ఉండగా, ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో భారతదేశంలో బంగారం డిమాండ్ బాగా తగ్గింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) తాజా నివేదిక ప్రకారం, మొత్తం బంగారం డిమాండ్ 16 శాతం తగ్గి 209.4 టన్నులకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో ఇది 248.3 టన్నులు. అధిక బంగారం ధరల కారణంగా వినియోగదారుల కొనుగోళ్లు తగ్గడం వల్ల ఈ తగ్గుదల ప్రధానంగా జరిగింది. అయితే, విలువ పరంగా, డిమాండ్ రూ.165,380 కోట్ల నుండి రూ.203,240 కోట్లకు పెరిగింది. ఇది 23 శాతం పెరుగుదల. దీని అర్థం ప్రజలు తక్కువ పరిమాణంలో బంగారాన్ని కొనుగోలు చేసినప్పటికీ, అధిక ధరలు మొత్తం ఖర్చును పెంచాయి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: EPFO Pension Rule: మీరు పదేళ్ల తర్వాత ఒక కంపెనీని వదిలివేస్తే పెన్షన్ వస్తుందా? నియమాలు ఏంటి?

బంగారానికి డిమాండ్ ఎందుకు తగ్గింది?

గత ఏడాది 171.6 టన్నులుగా ఉన్న బంగారు ఆభరణాల డిమాండ్ ఈ త్రైమాసికంలో కేవలం 117.7 టన్నులకు పడిపోయింది. ఇది దాదాపు 31 శాతం తగ్గుదల. అయితే కొనుగోలుదారులు పెరిగిన ధరలను పరిగణనలోకి తీసుకుని తమ బడ్జెట్‌లను సర్దుబాటు చేసుకోవడంతో ఆభరణాల కొనుగోళ్ల మొత్తం విలువ దాదాపు రూ.1,14,270 కోట్ల వద్ద స్థిరంగా ఉంది. మరోవైపు, పెట్టుబడిగా బంగారం డిమాండ్ గణనీయంగా పెరిగింది. పరిమాణం పరంగా ఇది 20 శాతం పెరిగి 91.6 టన్నులకు చేరుకోగా, విలువ పరంగా ఇది 74 శాతం పెరిగి రూ.51,080 కోట్ల నుండి రూ.88,970 కోట్లకు చేరుకుంది.

ఇది కూడా చదవండి: Business Idea: కోటీశ్వరులు కావాలనుకుంటే ఈ మొక్కలను నాటండి.. ఎకరాకు కోటి రూపాయలు!

ఇది కూడా చదవండి: Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ రైతులకు గుడ్‌న్యూస్‌.. ఎకరాకు రూ.10 వేలు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి