Telecom Rules: జనవరి 1 నుండి కొత్త టెలికాం నియమాలు.. జియో, ఎయిర్‌టెల్, వి, బిఎస్‌ఎన్‌ఎల్‌పై ప్రభావం!

Telecom Rules: RoW కొత్త నియమాలలో 5జీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనుంది. ఇప్పుడు టెలికాం మౌలిక సదుపాయాలు వేగంగా ఏర్పాటు అవుతున్నాయి. వేగవంతమైన నెట్‌వర్క్‌లకు ఈ నియమం చాలా సానుకూలంగా అనిపిస్తుంది.

Telecom Rules: జనవరి 1 నుండి కొత్త టెలికాం నియమాలు.. జియో, ఎయిర్‌టెల్, వి, బిఎస్‌ఎన్‌ఎల్‌పై ప్రభావం!

Updated on: Nov 22, 2024 | 12:45 PM

ప్రభుత్వం టెలికాం నిబంధనలను ఎప్పటికప్పుడు మారుస్తుంది. టెలికాం చట్టంలో కొన్ని కొత్త నిబంధనలు చోటు చేసుకున్నాయి. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్‌ ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్‌ సహా దేశంలోని అన్ని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను ప్రభావితం చేసే ఒక ప్రధాన నియమ మార్పు జనవరి 1, 2025 నుండి అమలులోకి రాబోతోంది. రైట్ ఆఫ్ వే (రోడబ్ల్యూ) పర్మిట్ రూల్ జనవరి 1 నుంచి అమలులోకి వస్తుంది, అన్ని రాష్ట్రాలు దీనిని అనుసరించాలని ఆదేశించింది. ఆప్టికల్ ఫైబర్ లైన్లు, టెలికాం టవర్ల సంస్థాపనను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) సెక్రటరీ నీరజ్ మిట్టల్ ఒక లేఖలో, రో పాలసీలలో రాబోయే మార్పుల గురించి సంబంధిత అధికారులకు తెలియజేయాలని రాష్ట్రాలను కోరారు.

కొత్త RoW నియమాలు దేశంలో టెలికాం మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని పెంచుతాయని, భారతదేశం అంతటా 5G టెక్నాలజీని వేగంగా రోల్ అవుట్ చేయడానికి కూడా దోహదపడుతుందని మిట్టల్ చెప్పారు.

నవంబర్ 30లోగా సమాధానం ఇవ్వాలి..

ఇవి కూడా చదవండి

ET నివేదిక ప్రకారం.. జనవరి 1 నుండి కొత్త నిబంధనను అమల్లోకి రానున్నట్లు తెలిపింది. ఇది ఆప్టికల్ ఫైబర్, టెలికాం టవర్‌లను ఏర్పాటు చేయడంలో వేగవంతం చేయనుంది. టెలికాం ఆపరేటర్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్లు కూడా దీని నుండి చాలా సహాయం పొందబోతున్నారు. ఈ విషయమై అన్ని రాష్ట్రాల కార్యదర్శులకు డీఓటీ సెక్రటరీ నీరజ్ మిట్టల్ లేఖ రాశారు. నవంబరు 30లోగా ప్రతి ఒక్కరూ భరోసా కల్పించాలని.. జనవరి 1 నుంచి రో పోర్టల్ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలిపారు.

రాష్ట్రానికి మరింత శక్తి

కొత్త రూల్ జనవరి 2025 నుండి అమలులోకి రావాలని, ప్రస్తుతం ఉన్న రో రూల్ ఇక్కడితో ఆగాలని లేఖలో పేర్కొన్నారు. అంటే ఇప్పుడు కొత్త రూల్ అమల్లోకి రానుంది. కొత్త రూల్ వచ్చిన తర్వాత, రాష్ట్రాలకు మరింత అధికారం ఇవ్వనుంది. తద్వారా ఈ విషయంపై అధికారానికి స్పష్టత ఇవ్వవచ్చు.

రో రూల్ అంటే ఏమిటి?

RoW నియమం అనేది ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్తిపై మొబైల్ టవర్లు, ఇతర టెలికాం స్థాపన కోసం ప్రమాణాలను తప్పనిసరి చేసే సూచనల సమితి. ప్రజా భద్రత, పారదర్శకతకు ప్రాధాన్యతనిస్తుంది. అందుకే ఈ నియమాన్ని ఆస్తి యజమానులు, టెలికాం ప్రొవైడర్లు ఇద్దరూ తప్పనిసరిగా అనుసరించాలి. ప్రాపర్టీ యజమానులు, టెలికాం ప్రొవైడర్లు రో నియమాలను మాత్రమే అనుసరిస్తారు. ఎందుకంటే దీని కింద ప్రజల భద్రత, పారదర్శకతకు చాలా ప్రాముఖ్యత ఇస్తుంది. జనవరి 1, 2025 నుండి కొత్త నియమం రాబోతోంది. ఆ తర్వాత చాలా మార్పులను చూడవచ్చు.

5జీపై దృష్టి:

RoW కొత్త నియమాలలో 5జీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనుంది. ఇప్పుడు టెలికాం మౌలిక సదుపాయాలు వేగంగా ఏర్పాటు అవుతున్నాయి. వేగవంతమైన నెట్‌వర్క్‌లకు ఈ నియమం చాలా సానుకూలంగా అనిపిస్తుంది. ఎందుకంటే 5జీ కోసం కొత్త టవర్‌లను ఇన్‌స్టాల్ చేయడంపై దృష్టి కేంద్రీకరించనుంది. ఇందులో గరిష్ట పరిమితి కూడా నిర్ణయించింది.

ఇది కూడా చదవండి: Adani Shares: అదానీ షేర్లలో గందరగోళం.. స్టాక్ మార్కెట్ ప్రారంభమైన వెంటనే రూ.76 వేల కోట్ల నష్టం!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us