SBI: అన్ని రికార్డ్‌లను బద్దలు కొట్టిన ఎస్‌బీఐ.. మూడు నెలల్లో సుమారు 17 వేల కోట్ల లాభం.. త్రైమాసిక ఫలితాలు విడుదల

సాధారణంగా బ్యాంకింగ్ రంగంలో త్రైమాసిక ఫలితాలు విడుదల అవుతుంటాయి. దాదాపు అన్ని బ్యాంకులు కూడా భారీ స్థాయిలో లాభాల వైపు వెళ్తుంటాయి. ప్రతి త్రైమాసికంలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు భారీగా లాభాలు ఆర్జిస్తుంటాయి. ఇప్పుడు దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) జూన్ 2023 త్రైమాసిక ఫలితాలను శుక్రవారం విడుదల చేసింది. అన్ని మునుపటి ఆదాయ రికార్డులను బద్దలు కొడుతూ అద్భుతమైన ఫలితాలను సాధించింది స్టేట్ బ్యాంక్. అయితే జూన్ నెల త్రైమాసికంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ ఎత్తున లాభాల్లో బాటలో కొనసాగింది..

SBI: అన్ని రికార్డ్‌లను బద్దలు కొట్టిన ఎస్‌బీఐ.. మూడు నెలల్లో సుమారు 17 వేల కోట్ల లాభం.. త్రైమాసిక ఫలితాలు విడుదల
SBI
Follow us

|

Updated on: Aug 04, 2023 | 9:53 PM

సాధారణంగా బ్యాంకింగ్ రంగంలో త్రైమాసిక ఫలితాలు విడుదల అవుతుంటాయి. దాదాపు అన్ని బ్యాంకులు కూడా భారీ స్థాయిలో లాభాల వైపు వెళ్తుంటాయి. ప్రతి త్రైమాసికంలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు భారీగా లాభాలు ఆర్జిస్తుంటాయి. ప్రతి త్రైమాసికంలో బ్యాంకుల ఫలితాలు విడుదల అవుతుంటాయి. దేశంలో ఎస్బీఐతో పాటు ఇతర బ్యాంకులు కూడా లాభాల బాటలో ఉంటాయి. ఇప్పుడు దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) జూన్ 2023 త్రైమాసిక ఫలితాలను శుక్రవారం విడుదల చేసింది. అన్ని మునుపటి ఆదాయ రికార్డులను బద్దలు కొడుతూ అద్భుతమైన ఫలితాలను సాధించింది స్టేట్ బ్యాంక్. అయితే జూన్ నెల త్రైమాసికంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ ఎత్తున లాభాల్లో బాటలో కొనసాగింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 178.24 శాతం పెరుగుదల ఉందని ఎస్బీఐ బ్యాంకు వెల్లడించింది. ఈ సంఖ్య రూ.17,000 కోట్లకు చేరుకుందని తెలిపింది. అయితే 15 వేల కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందుతుండగా, ఇది వరుసగా నాలుగో త్రైమాసికంలో ఎస్‌బీఐకి అత్యధిక లాభంతో ఉందని ఎస్బీఐ నివేదికలు చెబుతున్నాయి. ఇక బ్యాంక్ షేర్ల గురించి మాట్లాడినట్లయితే, అవి 3 శాతం క్షీణతతో ట్రేడవుతున్నట్లు లెక్కలు చూస్తే తెలుస్తోంది.

FY2024 మొదటి త్రైమాసికంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నికర వడ్డీ ఆదాయం త్రైమాసికంలో 24.7 శాతం పెరిగి రూ.38,905 కోట్లకు చేరుకుంది. దేశీయ నికర వడ్డీ మార్జిన్ 24 బేసిస్ పాయింట్లు మెరుగుపడి 3.47 శాతానికి చేరుకుంది. బ్యాంక్ స్థూల ఎన్‌పీఏ త్రైమాసికానికి 2.78 శాతం, అలాగే సంవత్సరానికి 3.9 శాతం నుంచి 2.76 శాతానికి తగ్గింది.

స్థూల ఎన్‌పీఏ క్షీణత:

స్థూల NPA వార్షిక ప్రాతిపదికన రూ.113,271.72 కోట్ల నుంచి రూ.91,327.84 కోట్లకు పడిపోయింది. వార్షిక కేటాయింపులు రూ.4,392 కోట్లు, అలాగే త్రైమాసికానికి రూ.3,316 కోట్లు కేటాయించగా కేటాయింపులు రూ.2,501 కోట్లుగా ఉన్నాయి. మరోవైపు త్రైమాసిక ప్రాతిపదికన ఆస్తులపై రాబడి 1 బేసిస్ పాయింట్ క్షీణించి 1.22 శాతానికి, డెట్-ఈక్విటీ నిష్పత్తి కూడా Q4FY23లో 0.66తో పోలిస్తే 0.64కి తగ్గింది.

వ్యవసాయ, కార్పొరేట్ రుణాల పెంపు:

బ్యాలెన్స్ షీట్ ముందు క్రెడిట్ వృద్ధి వార్షికంగా పరిశీలిస్తే 13.90 శాతంగా నమోదు కాగా, దేశీయ అడ్వాన్సులు వార్షికంగా 15.08 శాతంగా ఉన్నాయని ఫలితాలు చెబుతున్నాయి. ఆటో రుణాలు సైతం కోట్లల్లో మార్కును దాటగా, వ్యవసాయ రుణాలు, కార్పొరేట్ రుణాలు వరుసగా 14.84 శాతం, 12.38 శాతం వార్షిక వృద్ధిని సాధించాయి. త్రైమాసిక గణాంకాలు విడుదలైన తర్వాత, ఎస్‌బిఐ షేర్లు 3 శాతం పడిపోయి బీఎస్‌ఇలో రూ.572.80 వద్ద ట్రేడవుతున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి