Latest Silver Price: మార్కెట్లో పసిడి, వెండి ధరల్లో నిత్యం మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. అందుకే కొనుగులుదారులంతా ప్రత్యేకంగా వాటి ధరలవైపు దృష్టిసారిస్తుంటారు. ఈ మధ్య కాలంలో వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. కొంతకాలం నుంచి తగ్గుతూ వచ్చిన వెండి ధరలు ఇటీవల మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా శుక్రవారం కూడా వెండి ధరలు పెరిగాయి. దేశీయంగా కిలో వెండి ధర 64,600 గా ఉంది. కిలో వెండిపై రూ.1400 మేర పెరిగింది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
* దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 64,600 లుగా ఉంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 64,600లుగా కొనసాగుతోంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలోలో కిలో వెండి ధర రూ. 68,800లుగా ఉంది.
* కోల్కతాలో కిలో వెండి ధర 64,600 లుగా ఉంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో కిలో వెండి ధర రూ. 68,800గా ఉంది.
* కేరళలో కిలో వెండి ధర 68,800 లుగా కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు..
* హైదరాబాద్లో కిలో వెండి ధర రూ. 68,800గా ఉంది.
* విజయవాడలో ఈరోజు కిలో వెండి ధర రూ. 68,800గా ఉంది.
* విశాఖపట్నంలో సిల్వర్ రేట్ రూ. 68,800 వద్ద కొనసాగుతోంది.
కాగా.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్సైట్ల ఆధారంగా ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. ఎందుకంటే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. మీరు కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.
Also Read :