Silver Price Today: వెండి కొనుగోలుదారులకు గుడ్న్యూస్. ఒక వైపు బంగారం ధర పెరగకుండా స్థిరంగా కొనసాగితే.. మరో వైపు వెండి ధర దిగి వస్తోంది. అయితే బంగారం లాగే వెండికి కూడా మహిళలు ప్రాధాన్యత ఇస్తుంటారు. వెండితో తయారు చేసిన విగ్రహాలు, ఇతర వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా వెండి పాత్రలు కూడా చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. కిలో బంగారంపై రూ.300కుపైగా దిగి వచ్చింది. తాజాగా శుక్రవారం (డిసెంబర్ 10)న వెండి ధరలు ఇలా ఉన్నాయి. అయితే ఈ ధరలు ఉదయం 6 గంటలలోపు నమోదైనవి మాత్రమే. మళ్లీ ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని వినియోగదారులు గమనించాలి.
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర.61,600 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.61,600 ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.65,500 ఉండగా, కోల్కతాలో రూ.61,600 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.61,600 ఉండగా, కేరళలో రూ.65,500 ఉంది. ఇక హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.65,500 ఉండగా, విజయవాడలో రూ.65,500 వద్ద కొనసాగుతోంది. ఇలా బంగారం, వెండి ధరలలో మార్పులు కావడానికి ఎన్నో కారణాలున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్ ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్సైట్ల ఆధారంగా ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. ఎందుకంటే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. మీరు కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.
Also Read: