AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Amrit Kalash: సీనియర్ సిటిజన్లకు ఎస్‌బీఐ శుభవార్త.. 10 లక్షల పెట్టుబడితో రాబడి ఎంతంటే..?

సీనియర్ సిటిజన్లు రిటైరయ్యాక వచ్చిన సొమ్మును నమ్మకమైన సంస్థల్లో పెట్టుబడి పెట్టాలని ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇలాంటి వారు కచ్చితంగా ఫిక్స్‌డ్ డిపాజిట్లల్లో పెట్టుబడిని ఇష్టపడుతూ ఉంటారు. పదవీ విరమణ తర్వాత వారికి గ్యారెంటీ ఆదాయం అవసరం కాబట్టి వారు తమ మొత్తం మొత్తాన్ని ఎఫ్‌డీల్లోనే పెట్టుబడి పెడతారు. దీంతో చాలా బ్యాంకులు సీనియర్ సిటిజన్‌లను డబ్బు పెట్టుబడి పెట్టడానికి ప్రోత్సహించడానికి అదనపు వడ్డీ రేట్లను అందిస్తాయి. అందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి. ఇది సీనియర్ సిటిజన్లకు అదనపు వడ్డీ రేట్లను అందిస్తుంది.

SBI Amrit Kalash: సీనియర్ సిటిజన్లకు ఎస్‌బీఐ శుభవార్త.. 10 లక్షల పెట్టుబడితో రాబడి ఎంతంటే..?
Sbi
Nikhil
|

Updated on: Jul 14, 2024 | 6:00 PM

Share

ఏదైనా సమయంలో మన దగ్గ ఏకమొత్తంలో డబ్బు ఉండి మార్కెట్ రిస్క్ తీసుకోకుండా డిపాజిట్ చేయాలనుకున్నప్పుడు హామీతో వచ్చే రిటర్న్ ఎంపికల్లో పెట్టుబడికి ఆసక్తి చూపుతూ ఉంటారు. ముఖ్యంగా ఎక్కువ మొత్తంలో సొమ్ము ఉంటే చాలా మంది తెలిసిన వారికి వడ్డీకి ఇస్తూ ఉంటారు. అయితే అలా ఇచ్చినప్పుడు బాగానే ఉన్నా తిరిగి వసూలు చేసుకునే సమయంలో అసలు ఇబ్బంది తెలుస్తుంది. అందువల్ల చాలా మంది మంచి పెట్టుబడి ఎంపికల కోసం చూస్తూ ఉంటారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు రిటైరయ్యాక వచ్చిన సొమ్మును నమ్మకమైన సంస్థల్లో పెట్టుబడి పెట్టాలని ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇలాంటి వారు కచ్చితంగా ఫిక్స్‌డ్ డిపాజిట్లల్లో పెట్టుబడిని ఇష్టపడుతూ ఉంటారు. పదవీ విరమణ తర్వాత వారికి గ్యారెంటీ ఆదాయం అవసరం కాబట్టి వారు తమ మొత్తం మొత్తాన్ని ఎఫ్‌డీల్లోనే పెట్టుబడి పెడతారు. దీంతో చాలా బ్యాంకులు సీనియర్ సిటిజన్‌లను డబ్బు పెట్టుబడి పెట్టడానికి ప్రోత్సహించడానికి అదనపు వడ్డీ రేట్లను అందిస్తాయి. అందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి. ఇది సీనియర్ సిటిజన్లకు అదనపు వడ్డీ రేట్లను అందిస్తుంది. ఇది అమృత్ కలశ్ పథకంలో 1 సంవత్సరం, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు వ్యవధుల్లో ప్రత్యేక ఎఫ్‌డీ పథకాన్ని అందుబాటులో ఉంచింది. అమృత్ కలశ్ పథకంలో అత్యధిక వడ్డీ రేటును 7.60 శాతంగా అందిస్తుంది. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ అమృత్ కలశ్ పెట్టుబడి గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ఎస్‌బీఐ అమృత్ కలశ్ పథకంలో ఒక సంవత్సరం, మూడు సంవత్సరాలు, ఐదు సంవత్సరాల ఎఫ్‌డీ పథకాలకు వడ్డీ రేట్లు వరుసగా 7.30 శాతం, 7.25 శాతం మరియు 7.50 శాతంగా ఉన్నాయి. ఐదు సంవత్సరాల ఎఫ్‌డీలో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే, పెట్టుబడిదారుడు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.50 లక్షల వరకు డిపాజిట్లపై పన్ను ప్రయోజనాలను పొందుతారు.  ఒక సంవత్సరం ఎఫ్‌డీలో రూ. 2.50 లక్షల డిపాజిట్‌పై మీ వడ్డీ రూ. 18,756 అవుతుంది, మెచ్యూరిటీపై మీరు రూ. 2,68,756 పొందవచ్చు. మీరు ఈ పథకంలో రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే మీ వడ్డీ డబ్బు రూ. 37,511, మెచ్యూరిటీ మొత్తం రూ. 5,37,511 వస్తుంది. ఇందులో రూ.7.50 లక్షల పెట్టుబడి మీకు రూ.56,267 వడ్డీని, రూ.8,06,267 మెచ్యూరిటీని పొందడంలో సహాయపడుతుంది. ఈఎఫ్‌డీలో రూ. 10 లక్షలు పెట్టుబడి పెట్టిన తర్వాత మీ వడ్డీ రూ. 75,023 కాగా మెచ్యూరిటీ మొత్తం రూ. 10,75,023 అవుతుంది.

మూడు సంవత్సరాల సీనియర్ సిటిజన్ ఎఫ్‌డీలో రూ. 2.50 లక్షల పెట్టుబడి పెడితే రూ. 60,137 వడ్డీ వస్తుంది. అంటే మెచ్యూరిటీ రూ. 3,10,137 పొందవచ్చు. రూ. 5 లక్షల పెట్టుబడిపై వడ్డీ రూ. 1,20,273, మెచ్యూరిటీ రూ. 6,20,273 వస్తుంది. మీరు పథకంలో రూ.7.50 లక్షలు పెట్టుబడి పెట్టినప్పుడు, మీకు రూ.1,80,410 వడ్డీ, రూ.9,30,410 విలువైన మెచ్యూరిటీ లభిస్తుంది. మీరు 3 సంవత్సరాల ఎఫ్‌డీలో రూ. 10 లక్షలు పెట్టుబడి పెడితే మీకు రూ. 4,49,948 వడ్డీతో రూ. 14,49,948 మెచ్యూరిటీ రూపంలో లభిస్తుంది. ఐదు సంవత్సరాల ఎఫ్‌డీలో మీ పెట్టుబడి రూ. 2.50 లక్షలు అయితే మీ వడ్డీ మొత్తం రూ. 9,30,410 వస్తుంది. మెచ్యూరిటీ మొత్తం రూ. 3,62,487 అవుతుంది. రూ. 5 లక్షల పెట్టుబడిపై మీరు రూ. 2,24,974 వడ్డీని పొందుతారు. అయితే మీరు మెచ్యూరిటీ సమయంలో రూ. 7,24,974 పొందవచ్చు. రూ.7.50 లక్షల పెట్టుబడి మీరు రూ.3,37,461 వడ్డీతో కలిపి రూ.10,87,461 మెచ్యూరిటీ సొమ్ము అందుతుంది. రూ.10 లక్షల పెట్టుబడిపై పెట్టుబడిదారుడు రూ.4,49,948 వడ్డీతో మెచ్యూరిటీలో రూ.14,49,948 పొందవచ్చు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..