SBI Customer Alert: స్టేట్ బ్యాంక్ వినియోగదారులకు అలెర్ట్.. 45 నిమిషాలు సేవలకు అంతరాయం.. ఎప్పుడంటే..?

|

Jun 18, 2021 | 8:39 PM

SBI Online Banking Services: ప్రస్తుత కాలంలో ఆన్‌లైన్ బ్యాంకింగ్ ప్రస్తుతం ముఖ్యమైన కార్యకలాపాల్లో ఒకటిగా మారింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు బయటకు

SBI Customer Alert: స్టేట్ బ్యాంక్ వినియోగదారులకు అలెర్ట్.. 45 నిమిషాలు సేవలకు అంతరాయం.. ఎప్పుడంటే..?
SBI Customer Alert
Follow us on

SBI Online Banking Services: ప్రస్తుత కాలంలో ఆన్‌లైన్ బ్యాంకింగ్ ప్రస్తుతం ముఖ్యమైన కార్యకలాపాల్లో ఒకటిగా మారింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు బయటకు అడుగు పెట్టాలంటేనే భయపడుతున్నారు. అందుకే ఎక్కువగా ఆన్‌లైన్‌లో నగదు చెల్లించి అవసరమైన వస్తువులను ఇంటినుంచే పొందుతూ.. ఆన్‌లైన్‌లోనే నగదును చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో పలు బ్యాంకులు కూడా తమ సేవలను సులభతరం చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నాయి. దేశంలోని అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ కూడా సేవలను సులభతరం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. దీనిలో భాగంగా ఎస్‌బీఐ సేవలు శనివారం అర్థరాత్రి 40 నిమిషాల పాటు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వెల్లడించింది. జూన్ 20 (శనివారం అర్ధరాత్రి) ఒంటిగంట నుంచి 1.40 నిమిషాల వరకూ ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయని పేర్కొంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్ గ్రేడేషన్ మెయింటెనెన్స్ సర్వీసులో భాగంగా ఇటీవల కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. కస్టమర్ లకు మెరుగైన సేవలను అందించేందుకు ఈ అప్‌గ్రెడేషన్ చేస్తున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకు పేర్కొంది. మెరుగైన బ్యాంకింగ్ సేవలను అందించడానికి.. తాము చేస్తున్న కృషిని దృష్టిలో ఉంచుకొని.. ఖాతాదారులు తమకు సహకరించాలని ఎస్బీఐ కోరింది. ఈ 40 నిమిషాల వ్యవధిలో ఇంటర్నెట్ బ్యాంకింగ్/యోనో/యోనో లైట్/యుపీఐ సేవలు పనిచేయవని స్పష్టంచేసింది.

Also Read:

Viral Video: స్విమ్మింగ్ పూల్‌లో మరొకరితో సరదాగా భర్త.. అది చూసిన భార్య ఒక్కసారిగా ఏం చేసిందంటే..

COVID Vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే పురుషులలో పునరుత్పత్తి సామర్ధ్యం తగ్గుతుందనేది అపోహ.. తేల్చిచెప్పిన అధ్యయనాలు!