Ratan Tata: దేశం టాటాకు సెల్యూట్ చేసిన వేళ.. ఈ డీల్‌కు మంచి గుర్తింపు!

రతన్‌ టాటా.. వ్యాపారంలో రాణించిన వ్యక్తి. అంతేకాదు మానవతావాది. తన సేవలు దేశానికి ఎంతో అందించిన వ్యక్తి. 86 వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. అయినా ఆయన జ్ఞాపకాలు ఎప్పటికి మిగిలే ఉంటాయి. తన వ్యాపారాన్ని అంచెలంచెలుగా విస్తరిస్తూ మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి.

Ratan Tata: దేశం టాటాకు సెల్యూట్ చేసిన వేళ.. ఈ డీల్‌కు మంచి గుర్తింపు!

Updated on: Oct 19, 2024 | 4:27 PM

భారతదేశంలోని అత్యంత గౌరవనీయమైన, వ్యాపారంలో విజయవంతమైన పారిశ్రామికవేత్తలలో రతన్ టాటా. అతను 28 డిసెంబర్ 1937న ముంబైలో జన్మించారు. ఆయన 86 ఏళ్ల వయసులో లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. అతని తండ్రి నావల్ టాటా, తల్లి సునీ టాటా. రతన్ టాటాకు కేవలం 7 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, అతని తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత అతని అమ్మమ్మ నవాజ్‌బాయి టాటా వద్ద పెరిగారు. రతన్ టాటాకు తన అమ్మమ్మ పట్ల గాఢమైన ఆప్యాయత ఉంది. ఆమె రతన్‌ టాటాను అత్యంత ప్రేమ, శ్రద్ధతో పెంచింది.

ప్రారంభ చదువులు ముంబైలోనే..

రతన్ టాటా ప్రాథమిక విద్యాభ్యాసం ముంబైలో జరిగినా, ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాడు. అతను కార్నెల్ విశ్వవిద్యాలయం నుండి ఆర్కిటెక్చర్‌లో పట్టా పొందారు. 1975లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండి అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేశారు. ఈ విద్యాభ్యాసం రతన్‌ టాటాకి మెరుగైన వ్యాపార దృక్పథాన్ని అందించడమే కాకుండా, ప్రపంచంలోని అత్యంత ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరిగా మారడానికి సహాయపడింది.

టాటా స్టీల్‌తో కెరీర్ ప్రారంభం:

రతన్ టాటా తన కెరీర్‌ను టాటా స్టీల్‌లో ట్రైనీగా ప్రారంభించారు. గనులు, బ్లాస్ట్ ఫర్నేస్‌లలో పనిచేశారు. దీంతో రతన్‌ టాటా ఏ పని చేయడానికి వెనుకాడడని నిరూపించుకున్నారు. ఇది తర్వాత టాటా గ్రూప్‌లోని NELCO, ఎంప్రెస్ మిల్స్ వంటి అనేక ముఖ్యమైన కంపెనీలకు బాధ్యత వహించేలా చేసింది. 1991లో రతన్ టాటా టాటా గ్రూప్‌కు ఛైర్మన్‌గా నియమితుడయ్యారు. అతని నాయకత్వంలో టాటా గ్రూప్ అనేక పెద్ద విజయాలను సాధించింది.

ఈ డీల్ టాటాకు గుర్తింపు తెచ్చిందా?

రతన్ టాటా నాయకత్వంలో టాటా గ్రూప్ అంతర్జాతీయ స్థాయిలో ముందడుగు వేసింది. అతను జాగ్వార్, ల్యాండ్ రోవర్, టెట్లీ టీ, కోరస్ స్టీల్ వంటి కంపెనీలను కొనుగోలు చేశారు. టాటా గ్రూప్‌ను విస్తరించడమే కాకుండా ప్రపంచ వాణిజ్య వేదికపై భారతదేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాయి. రతన్ టాటా అత్యంత ప్రసిద్ధ ప్రాజెక్ట్ ‘టాటా నానో’. ఇది 2008లో ప్రారంభించారు. ప్రతి భారతీయ సామాన్యుడు కారును కొనుగోలు చేయాలనే కలను సాకారం చేసేందుకు నానో కారును తీసుకువచ్చారు. ఇది ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారు. ఇది మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా తయారు చేశారు.

దేశం టాటాకు సెల్యూట్ చేసిన వేళ:

75 ఏళ్ల వయస్సులో రతన్ టాటా టాటా గ్రూప్ ఛైర్మన్ పదవి నుండి పదవీ విరమణ చేయాలని నిర్ణయించుకున్నారు. తదుపరి ఛైర్మన్‌గా సైరస్ మిస్త్రీని నియమించారు. అయితే కొంతకాలం తర్వాత మిస్త్రీని తొలగించి ఈ బాధ్యతను చంద్రశేఖరన్‌కు అప్పగించారు. రతన్ టాటా తన సేవలకు గాను ఎన్నో గౌరవాలు అందుకున్నారు. 2000లో పద్మభూషణ్, 2008లో పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్నారు. దేశానికి ఆయన చేసిన ఎనలేని సేవలకు ఈ అవార్డులు వచ్చాయి. రతన్ టాటా విజయవంతమైన పారిశ్రామికవేత్త మాత్రమే కాదు. మానవతావాది కూడా. టాటా ట్రస్ట్ ద్వారా విద్య, ఆరోగ్యం, సాంఘిక సంక్షేమ రంగంలో ఆయన గణనీయమైన కృషి చేశారు. సమాజానికి సహకరించడంలోనే నిజమైన విజయం దాగి ఉందని ఆయన నమ్మేవారు.

ఇది కూడా చదవండి: Jio: జియో నుంచి దిమ్మదిరిగే ఆఫర్‌.. కేవలం రూ.101 రీఛార్జ్‌తో అన్‌లిమిటెడ్ డేటా!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us