Banking News: మూడవ త్రైమాసికంలో ఆ బ్యాంకు లాభాలు రెట్టింపు.. జనవరిలో పెరిగిన చార్జీలు..!

| Edited By: Shaik Madar Saheb

Jan 28, 2022 | 11:38 AM

Punjab National Bank: డిసెంబర్ 2021తో ముగిసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) సింగిల్ నికర లాభం రెండింతలు పెరిగి రూ.1,126.78 కోట్లకు చేరుకుంది.

Banking News: మూడవ త్రైమాసికంలో ఆ బ్యాంకు లాభాలు రెట్టింపు.. జనవరిలో పెరిగిన చార్జీలు..!
Follow us on

Punjab National Bank: డిసెంబర్ 2021తో ముగిసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) సింగిల్ నికర లాభం రెండింతలు పెరిగి రూ.1,126.78 కోట్లకు చేరుకుంది. ప్రభుత్వ రంగ బ్యాంకు గురువారం ఈ సమాచారాన్ని వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో బ్యాంక్ రూ.506.03 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2021 అక్టోబర్-డిసెంబర్ మధ్య కాలంలో మొత్తం ఆదాయం రూ. 23,298.53 కోట్ల నుంచి రూ. 22,026.02 కోట్లకు తగ్గిందని స్టాక్ ఎక్స్ఛేంజీకి PNB తెలిపింది.

జనవరిలో బ్యాంకు చార్జీల పెంపు:

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (PNB) సాధారణ బ్యాంకింగ్ సంబంధిత వ్యాపారానికి సంబంధించిన సేవలకు ఛార్జీలను పెంచింది. ఈ పెరిగిన ఛార్జీలు 15 జనవరి 2022 నుండి అమలులోకి వచ్చాయి. PNB వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న కొత్త ఛార్జీల ప్రకారం.. మెట్రో ప్రాంతంలో త్రైమాసిక బ్యాలెన్స్‌ను నిర్వహించని ఛార్జీని ప్రస్తుత రూ.5,000 నుండి రూ.10,000కి పెంచారు.

గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయని ఛార్జీని త్రైమాసికానికి రూ.200 నుంచి రూ.400కి పెంచారు. పట్టణ, మెట్రో ప్రాంతాలకు ఈ ఛార్జీని రూ.300 నుంచి రూ.600కు పెంచారు. (ఈ ఛార్జీ త్రైమాసిక ప్రాతిపదికన తీసుకోబడుతుంది).

అంతకుముందు, డిసెంబర్ 2021 త్రైమాసికంలో నికర లాభంలో రెండు రెట్లు ఎక్కువ పెరిగిందని కెనరా బ్యాంక్ గురువారం తెలిపింది. బ్యాంకు ప్రకారం, బలహీనమైన కేటాయింపులే దీని వెనుక కారణం. డిసెంబర్ త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ ప్రాతిపదికన రూ.1,502 కోట్లుగా ఉంది. గత ఏడాది త్రైమాసికంలో బ్యాంక్ రూ.696 కోట్ల నికర లాభం ఆర్జించింది. సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే బ్యాంక్ నికర లాభం 13 శాతం పెరిగింది. సెప్టెంబర్ త్రైమాసికంలో బ్యాంక్ రూ.1,333 కోట్ల లాభాన్ని ఆర్జించింది.

డిసెంబర్ 2021తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం 18.8 శాతం పెరిగి రూ. 6536.55 కోట్లకు చేరుకుందని ఐసిఐసిఐ బ్యాంక్ శనివారం తెలిపింది. ఈ కాలంలో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (NII) గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.9,912 కోట్ల నుంచి 23 శాతం పెరిగి రూ.12,236 కోట్లకు చేరుకుంది. స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి సంబంధించిన గణాంకాలను బ్యాంక్ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

Maruti, Hyundai: కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌.. మారుతి సుజుకి, హ్యుందాయ్‌ కార్లపై తగ్గింపు ఆఫర్‌..!,

Insurance Policy: మీరు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకుంటున్నారా..? తెలుసుకోవాల్సిన విషయాలు..!