EPFO: పీఎఫ్ ఖాతాదారులకు తీపి కబురు.. పెరిగిన వడ్డీ రేటు.. ఈ సారి ఎంతో తెలుసా?

|

Feb 10, 2024 | 12:58 PM

సీబీటీ నిర్ణయం తర్వాత 2023-24 ఈపీఎఫ్‌ డిపాజిట్లపై వడ్డీ రేటు సమ్మతి కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపడం జరుగుతుంది. ప్రభుత్వ ధృవీకరణ తర్వాత 2023-24 కోసం ఈపీఎఫ్‌ వడ్డీ రేటు ఈపీఎఫ్‌వోకు చెందిన ఆరు కోట్ల మంది సబ్‌స్క్రైబర్‌ల ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా ప్రభుత్వం ఆమోదించిన తర్వాత మాత్రమే EPFO ​​వడ్డీ రేటును అందిస్తుంది. 2011-12లో వడ్డీ రేటు 8.25 శాతం, 2012-13కి 8.5 శాతం..

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు తీపి కబురు.. పెరిగిన వడ్డీ రేటు.. ఈ సారి ఎంతో తెలుసా?
EPFO
Follow us on

పీఎఫ్‌ చందాదారులకు తీపి కబురు. 2023-24 ఆర్థిక సంవత్సరానిగాను ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) వడ్డీ రేటు 8.25 శాతానికి పెరిగింది. ఈ మేరకు ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌వో) కేంద్ర ట్రస్టీల బోర్డు (CBT) నిర్ణయం తీసుంది. వడ్డీ రేటును 8 శాతానికి తగ్గించవచ్చనే వార్తలు వచ్చినప్పటికీ, 8.25 శాతంగా ఖరారు చేసినట్లు వెల్లడించింది. ఇక 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇది 8.15 శాతంగా ఉండగా, 2021-22 ఆర్థిక సంవత్సరంలో 8.10 శాతంగా ఉంది. దీంతో గత సంవత్సరాలలో ఇదే అత్యధిక వడ్డీ రేటు. శనివారం జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈపీఎఫ్ఓ వర్గాలు వెల్లడించాయి.

సీబీటీ నిర్ణయం తర్వాత 2023-24 ఈపీఎఫ్‌ డిపాజిట్లపై వడ్డీ రేటు సమ్మతి కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపడం జరుగుతుంది. ప్రభుత్వ ధృవీకరణ తర్వాత 2023-24 కోసం ఈపీఎఫ్‌ వడ్డీ రేటు ఈపీఎఫ్‌వోకు చెందిన ఆరు కోట్ల మంది సబ్‌స్క్రైబర్‌ల ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా ప్రభుత్వం ఆమోదించిన తర్వాత మాత్రమే EPFO ​​వడ్డీ రేటును అందిస్తుంది. 2011-12లో వడ్డీ రేటు 8.25 శాతం, 2012-13కి 8.5 శాతం,2013-14, 2014-15 ఆర్థిక సంవత్సరాల్లో లో 8.75 శాతం వడ్డీని అందించింది. 2015-16లో వడ్డీ రేటు 8.8 శాతం, 2016-17లో 8.65 శాతం, 2017-18లో 8.55 శాతం వడ్డీ రేటును అందించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి