Post Office: పోస్టాఫీసు ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. కొత్త సదుపాయం ప్రారంభం!

మీకు పోస్ట్ ఆఫీస్‌లో ఖాతా ఉంటే ఇది మీకు ఉపయోగపడనుంది. ఈసారి పోస్టాఫీసు తన వినియోగదారులకు గొప్ప సౌకర్యాలను అందించబోతోంది. పోస్టాఫీసులో ఖాతాలు ఉన్న ఖాతాదారులు..

Post Office: పోస్టాఫీసు ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. కొత్త సదుపాయం ప్రారంభం!
Post Office

Updated on: Nov 02, 2022 | 7:10 AM

మీకు పోస్ట్ ఆఫీస్‌లో ఖాతా ఉంటే ఇది మీకు ఉపయోగపడనుంది. ఈసారి పోస్టాఫీసు తన వినియోగదారులకు గొప్ప సౌకర్యాలను అందించబోతోంది. పోస్టాఫీసులో ఖాతాలు ఉన్న ఖాతాదారులు ఇప్పుడు ఎలక్ట్రానిక్ పద్ధతిలో నిధులను బదిలీ చేసే కొత్త నిబంధనను పోస్ట్ ఆఫీస్ అమలు చేసింది. ఇప్పుడు NEFT, RTGS సౌకర్యం పోస్టాఫీసు నుండి ప్రారంభమైంది. పోస్టాఫీసు NEFT సౌకర్యాన్ని ప్రారంభించింది. అయితే RTGS సేవ కూడా మే 31 నుండి ప్రారంభమైంది. అంటే ఇప్పుడు పోస్టాఫీసు ఖాతాదారులకు డబ్బులు పంపే వెసులుబాటు లభించనుంది. ఇతర బ్యాంకుల మాదిరిగానే మరింత యూజర్ ఫ్రెండ్లీగా మారుతోంది. ఇది మాత్రమే కాదు ఈ సదుపాయం మీకు 24 గంటల పాటు 7 రోజులు అందుబాటులో ఉంటుంది.

బ్యాంకు నుండి ఈ సదుపాయాలు ఉన్నట్లే పోస్టాఫీసులు కూడా కల్పిస్తున్నాయి. NEFT, RTGS ద్వారా మరొక ఖాతాకు డబ్బు పంపడం చాలా సులభం. మీరు ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఫండ్ ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. దీనికి కొన్ని నిబంధనలు, షరతులు ఉన్నాయి. NEFTలో డబ్బును బదిలీ చేయడానికి పరిమితి లేదు. అయితే RTGSలో మీరు ఒకేసారి కనీసం రూ. 2 లక్షలు పంపవచ్చు.

ఈ సదుపాయం కోసం మీరు కొన్ని ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. NEFTలో రూ.10 వేల వరకు రూ.2.50తో పాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. 10 వేల నుంచి లక్ష రూపాయల వరకు 5 రూపాయలతో పాటు జీఎస్టీ కూడా చెల్లించాలి. అదే సమయంలో రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు రూ.15తో జీఎస్టీ, రూ.2 లక్షలకు మించిన సొమ్ముకు రూ.25 జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Loading...
Unable to load recommendations.
Follow Us