AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ నిధులు జమ అయ్యేది అప్పుడే..

కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ పథకం కింద 16 సార్లు నిధులు విడుదల చేశారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 9 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతోంది. ఇదిలా ఉంటే 17వ విడత నిధులపై అందరి దృష్టిపడింది. రైతుల ఖాతాల్లోకి ఈ నిధులు ఎప్పుడు వస్తాయన్న దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. తాజాగా ఈ నిధులకు సంబంధించి పలు వార్తలు వైరల్‌ అవుతున్నాయి...

PM Kisan: రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ నిధులు జమ అయ్యేది అప్పుడే..
Pm Kisan
Narender Vaitla
|

Updated on: May 20, 2024 | 1:07 PM

Share

రైతన్నలకు ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు, పెట్టుబడి భారం కాకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి అనే పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 2019లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా రైతులకు ఏడాదికి ఒక్కో ఎకరానికి రూ. 6వేలు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ మొత్తాన్ని ఏడాదిలో మూడు విడతులుగా రైతుల బ్యాంక్‌ ఖాతాల్లోకి నేరుగా ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ పథకం కింద 16 సార్లు నిధులు విడుదల చేశారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 9 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతోంది. ఇదిలా ఉంటే 17వ విడత నిధులపై అందరి దృష్టిపడింది. రైతుల ఖాతాల్లోకి ఈ నిధులు ఎప్పుడు వస్తాయన్న దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. తాజాగా ఈ నిధులకు సంబంధించి పలు వార్తలు వైరల్‌ అవుతున్నాయి. పీఎం కిసాన్‌ 17వ విడత డబ్బులు మే నెల చివరి వారంలో లేదా జూన్ మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఈసారి ఈ-కేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే పీఎం కిసాన్‌ డబ్బులు వస్తాయని సమాచారం. ఒకవేళ కేవైసీ పూర్తి చేయకపోతే వెంటనే చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. బ్యాంక్ ఖాతా కూడా ఆధార్‌తో లింక్ అయ్యి ఉండాలని అధికారులు చెబుతున్నారు. సమయానికి కిసాన్‌ నిధులు రావాలంటే కేవైసీ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇంతకీ ఈ కేవైసీ ఎలా చేసుకోవాలనేగా మీ సందేహం. ఇందుకోసం ఈ స్టెప్స్‌ ఫాలో అవ్వాలి..

* ముందుగా పీఎం కిసాన్​ అధికారిక వెబ్​సైట్​ https://pmkisan.gov.in/ లోకి లాగిన్​ అవ్వాలి.

* అనంతరం హోమ్‌ పేజీలో కుడివైపున కనిపించే e-KYC ఆప్షన్స్‌పై క్లిక్‌ చేయాలి.

* ఆ తర్వత మీ ఆధార్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేసి సెర్చ్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

* వెంటనే మీ వివరాలు స్క్రీన్​ మీద డిస్​ప్లే అవుతాయి. ఓటీపీ సాయంతో ఈ ప్రక్రియ పూర్తి చేయొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే