PM Kisan: రైతులకు షాక్‌.. పీఎం కిసాన్‌ జాబితా నుంచి లక్షలాది మంది పేర్లు ఔట్.. మీ పేరు ఉందో లేదో తెలుసుకోండి

|

Jan 21, 2023 | 1:07 PM

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 13వ విడతకు సంబంధించి రైతుల నిరీక్షణ మరింత ఎక్కువైంది. ముందుగా ఈ విడత జనవరి 26 నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని భావించారు. అయితే..

PM Kisan: రైతులకు షాక్‌.. పీఎం కిసాన్‌ జాబితా నుంచి లక్షలాది మంది పేర్లు ఔట్.. మీ పేరు ఉందో లేదో తెలుసుకోండి
కానీ ఏదైనా కారణం వల్ల పేరును ప్రభుత్వం తిరస్కరించినట్లయితే, అతను అర్హత పొందలేడు. అలాంటివారికి ప్రధానమంత్రి కిసాన్ యోజన డబ్బు అందదు. అయితే, పైన తెలిపిన కారణాల వల్ల నగదు రాకపోతే ఇలా చేయండి. దీంతో నగదు జమ అయ్యే అవకాశం ఉంటుంది.
Follow us on

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 13వ విడతకు సంబంధించి రైతుల నిరీక్షణ మరింత ఎక్కువైంది. ముందుగా ఈ విడత జనవరి 26 నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని భావించారు. అయితే ఇప్పుడు కొత్త తేదీ తెరపైకి వస్తోంది. పీఎం కిసాన్‌ పథకంలో అనర్హులుగా ఉండి, ప్రయోజనాలు పొందుతున్న రైతులను ఏరివేసి పనిలో ఉంది కేంద్ర ప్రభుత్వం. అనర్హుల పేర్లను ప్రభుత్వం జాబితా నుంచి తొలగిస్తోంది. ఈ కారణంగా ఈసారి పీఎం కిసాన్ 13వ విడత పొందడంలో జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే 2.41 కోట్ల మంది రైతులు 11వ విడత పొందారు. ప్రభుత్వం జాబితా నుండి పేర్లను తొలగించడానికి కారణం e-KYC లేకపోవడమే. అలాగే ఈ పథకం పొందేందుకు అర్హత లేని రైతులను గురించి జాబితా నుంచి వారి పేర్లను తొలగిస్తోంది. అవగాహన కోసం ప్రభుత్వం గ్రామ గ్రామాన ఈ-కేవైసీ క్యాంపులు కూడా నిర్వహిస్తోంది. యూపీలో 2.41 కోట్ల మంది రైతులు 11వ విడత పొందగా, 12వ విడతలో ఈ సంఖ్య 1.7 కోట్లకు తగ్గింది. ఇప్పుడు 13వ విడత కంటే ముందే 33 లక్షల మంది రైతుల పేర్లను తొలగించినట్లు సమాచారం.

7 లక్షల మంది రైతుల ఇ-కెవైసి ఇంకా చేయనట్లు ప్రభుత్వం గుర్తించింది. గోరఖ్‌పూర్, బస్తీ డివిజన్‌లలో గరిష్టంగా 7 లక్షల మంది రైతులు ఇ-కెవైసిని కలిగి ఉన్నారు. ఈ విషయమై జాయింట్ అగ్రికల్చర్ డైరెక్టర్ రాకేష్ బాబు మాట్లాడుతూ.. ఈ-కేవైసీ చేయించుకోని అర్హులైన రైతులు 13వ విడత కూడా తీసుకోలేరని, ఈసారి 13వ విడత జనవరిలో రైతుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. మీరు ఇంకా e-KYC ప్రక్రియను పూర్తి చేయకుంటే, వీలైనంత త్వరగా దాన్ని పూర్తి చేయండి.

ఇవి కూడా చదవండి

జాబితాలో మీ పేరును తనిఖీ చేయండి:

మీరు 13వ విడత కోసం మీ పేరును తనిఖీ చేయాలనుకుంటే ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి. ఇక్కడ కార్నర్‌పై క్లిక్ చేసి, ఆపై లబ్ధిదారుల జాబితాలో మీ పేరును తనిఖీ చేయండి. మీ e-KYC, భూమి వివరాలు పూర్తిగా ఉన్నాయో లేదో తనిఖీ చేయండి. మీ స్థితికి ముందు అవును ఉంటే మీ ఖాతాలో 13వ విడత నిధులు వస్తాయి. లేకుంటే నో అని ఉంటే కనుక 13వ విడత వాయిదా రావని గుర్తించుకోవాలి.

కాగా, ఈ పీఎం కిసాన్‌ స్కీమ్‌లో కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏడాదిలో రూ.6000 చొప్పున అందిస్తోంది. ఈ డబ్బులు మూడు విడతల్లో రూ.2,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. దేశంలో ఎంతో మంది అనర్హులైన రైతులు ఈ పథకం కింద డబ్బులు పొందుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించి జాబితా నుంచి వారి పేర్లను తొలగించే పనిలో ఉంది.