
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) అనేది దేశంలోని అన్ని భూస్వామ్య రైతుల కుటుంబాలకు వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలకు ఆర్థిక సాయం అందించే పథకం. ఈ పథకం కింద లక్షిత లబ్ధిదారులకు ప్రయోజనాల బదిలీకి సంబంధించిన మొత్తం ఆర్థిక బాధ్యతను కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ప్రతి నాలుగు నెలలకు ఓ సారి అంటే ఏడాదికి మూడుసార్లు రూ.2 వేల చొప్పున రైతుల అకౌంట్లోకి జమ చేస్తారు. 16వ విడతగా రూ.2 వేల ఫిబ్రవరి 28, 2024న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అర్హులైన రైతులకు విడుదలయ్యాయి. ఈ వాయిదా డిసెంబర్ 2023 నుంచి మార్చి 2024 వరకు వర్తిస్తుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 16వ విడతను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. డీబీటీ ద్వారా 9 కోట్ల మందికి పైగా రైతులకు రూ.21,000 కోట్లకు పైగా పంపిణీ చేశారు. అయితే కొంతమందికి 16వ విడత ఇన్స్టాల్ మెంట్ ఇంకా జమ కాలేదు.ఈ నేపథ్యంలో ఇలా నగదు జమ కాని వారు ఎలా ఫిర్యాదు చేయాలో? ఓసారి తెలుసుకుందాం.
లబ్ధిదారులకు రూ.2000 అందని రైతుల్లో మీరూ ఒకరైతే దానిపై ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చు. నిర్దిష్ట 4-నెలల వ్యవధిలో సంబంధిత రాష్ట్రం/యూటీ ద్వారా పీఎం కిసాన్ పోర్టల్లో పేర్లు అప్లోడ్ చేసిన లబ్ధిదారులు ఆ 4 నెలల వ్యవధి నుంచి ఆ కాలానికి ప్రయోజనం పొందేందుకు అర్హులుగా ఉంటారు. వారు ఆ 4-నెలల వ్యవధితో పాటు తదుపరి వాయిదాల గురించి వాయిదాల చెల్లింపును ఏ కారణం చేతనైనా అందుకోకపోతే వారు తిరిగి సొమ్ము కోసం ఫిర్యాదు చేసుకోవచ్చు. అయితే మినహాయింపు ప్రమాణాల పరిధిలోకి వచ్చినందుకు తిరస్కరణ గురైతే వారు సొమ్మును స్వీకరించలేరు. ఈ నేపథ్యంలో పీఎం కిసాన్ పోర్టల్లో ఎలా ఫిర్యాదు చేయవచ్చో? ఓసారి తెలుసుకుందాం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..