
ఉద్యోగుల జీతంలో కొంత భాగం ప్రతి నెలా ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతాలో జమ అవుతుంది. మీ పీఎఫ్ మొత్తంపై ప్రభుత్వం 8.25 శాతం ఆకర్షణీయమైన వడ్డీ రేటును అందిస్తుంది. EPF సురక్షితమైన, అత్యంత ప్రతిఫలదాయకమైన దీర్ఘకాలిక పెట్టుబడి ఎంపికలలో ఒకటిగా ఉంది. మొత్తంగా ఉద్యోగి రిటైర్ అయ్యేనాటికి ఒక పెద్ద మొత్తాన్ని అతనికి, అతనికి కుటుంబ భవిష్యత్తు కోసం అందిస్తుంది. అయితే కొంతమందిలో పీఎఫ్ గురించి కొన్ని డౌట్స్ ఉంటాయి.. “నేను 40 లేదా 45 సంవత్సరాల వయసులో నా ఉద్యోగాన్ని వదిలివేసి, పీఎఫ్ డబ్బును విత్డ్రా చేయకుండా వదిలేస్తే, ఆ తర్వాత కూడా దానిపై వడ్డీ వస్తుందా? నేను ఉద్యోగం చేయకుంటే వడ్డీ ఆగిపోతుందా?” అనే డౌట్స్ ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
EPFO నిబంధనల ప్రకారం.. మీరు 58 ఏళ్లు నిండకముందే మీ ఉద్యోగాన్ని వదిలివేసి, మీ PF బ్యాలెన్స్ను ఉపసంహరించుకోకపోతే, మీ ఖాతా డీయాక్టివేట్ కాదు. బదులుగా మీకు 58 ఏళ్ల వయస్సు వచ్చే వరకు మీ పొదుపులు వడ్డీని సంపాదిస్తూనే ఉంటాయి. ఉదాహరణకు.. మీరు 40 ఏళ్ల వయసులో పని చేయడం మానేసి, మీ PF ఖాతా నుంచి డబ్బు తీయకుండా ఉంటే మరో 18 సంవత్సరాల పాటు వడ్డీతో పెరుగుతుంది.
మీరు 58 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేసి, మీ EPFని వెంటనే ఉపసంహరించుకోకపోతే, మీ పొదుపు ఖాతా మరో మూడు సంవత్సరాలు – మీకు 61 ఏళ్లు నిండే వరకు వడ్డీని సంపాదిస్తూనే ఉంటుంది. ఆ తర్వాత మీ అకౌంట్ డీయాక్టివేట్ అవుతుంది. అంటే వడ్డీ పెరగడం ఆగిపోతుంది. కానీ అందులోని డబ్బు ఎక్కడికీ పోదు. చాలా మంది ఉద్యోగాలు మానేసిన వెంటనే ఖాతా ఆటోమేటిక్గా డీయాక్టవేట్ అవుతుందని భావించి, PF డబ్బులు విత్డ్రా చేసుకుంటూ ఉంటారు. కానీ అలా చేయడం వల్ల సంవత్సరాల తరబడి వడ్డీ పెరుగుదలను కోల్పోతారు. మీరు ఫిక్స్డ్ డిపాజిట్ లేదా ఇతర పథకాలలో పెట్టుబడి పెట్టాలని ఆలోచించినా, ఆ మొత్తాన్ని మీ EPFలో ఉంచడం ఉత్తమం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి