AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Digital Credit: వీధి వ్యాపారులకు గుడ్‌ న్యూస్.. డిజిటల్ లోన్ సర్వీస్‌ ప్రారంభించనున్న కేంద్రం..

చిన్న వీధి వ్యాపారులు కూడా పెద్ద బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునేలా డిజిటల్ లోన్ సర్వీస్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనుంది.

Digital Credit: వీధి వ్యాపారులకు గుడ్‌ న్యూస్.. డిజిటల్ లోన్ సర్వీస్‌ ప్రారంభించనున్న కేంద్రం..
LOAN
Sanjay Kasula
|

Updated on: Feb 13, 2023 | 6:50 AM

Share

కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం డిజిటల్ లోన్ సర్వీస్‌ను ప్రారంభించనుంది. టెలికాం, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ సమాచారాన్ని అందించారు. ఈ సేవతో చిన్న వీధి వ్యాపారులు కూడా పెద్ద బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోగలుగుతారు. ‘డిజిటల్ పేమెంట్ ఫెస్టివల్’లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రసంగిస్తూ.. యూపీఐ సర్వీస్ లాగా దీన్ని ప్రవేశపెడతామని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘డిజిటల్ ఇండియా’ విజన్ కింద పథకాన్ని అందించనున్నారని తెలిపారు.

కేంద్ర మంత్రి అష్నిని వైష్ణవ్ మాట్లాడుతూ, “ఈ సంవత్సరం డిజిటల్ లోన్ సేవను ప్రారంభిస్తాం. రాబోయే 10-12 సంవత్సరాలలో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లేదా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ముందుకు వస్తుంది.” ఈ కార్యక్రమంలో, ఎలక్ట్రానిక్స్ , IT మంత్రి UPI కోసం వాయిస్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ నమూనాను ఆవిష్కరించారని తెలిపారు.

యూపీఐని స్థానిక భాషల్లో ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి.. ఎక్కువ మందికి చేరుకునేలా డిజిటల్ చెల్లింపులు అన్ని రంగాలలో ప్రభుత్వం కృషి చేస్తోందని ఐటి మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. NPCI ద్వారా దేశంలోని ప్రతి మూలకు తీసుకెళ్లేందుకు అనేక ప్రాజెక్టుల పనులు కూడా జరుగుతున్నాయి.

UPI గ్లోబల్ పేమెంట్ ప్రోడక్ట్ కానుంది..

ఈ సందర్భంగా మంత్రిత్వ శాఖ కార్యదర్శి అల్కేశ్‌ కుమార్‌ శర్మ మాట్లాడుతూ యూపీఐ గ్లోబల్‌ పేమెంట్‌ ఉత్పత్తిగా మారనుందని, ఇందుకోసం ఎన్‌పీసీఐ ఇప్పటికే నేపాల్‌, సింగపూర్‌, భూటాన్‌ వంటి దేశాలతో భాగస్వామ్యాన్ని ప్రారంభించిందన్నారు. ఆస్ట్రేలియా, కెనడా, హాంకాంగ్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, సింగపూర్, యుఎఇ, యుకె, యుఎస్‌ఎలోని 10 దేశాల ప్రవాస భారతీయులకు (ఎన్‌ఆర్‌ఐ) యుపిఐ సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన చెప్పారు.

ఈసారి G-20కి భారతదేశం అధ్యక్షత వహిస్తోంది. ఈ సమయంలో డిజిటల్ చెల్లింపు పథకాన్ని పెద్ద ఎత్తున అమలు చేయడానికి ప్రణాళిక చేయబడింది. ఈ డిజిటల్ చెల్లింపు పండుగ రోజున.. అంటే అక్టోబర్ 9 వరకు కొనసాగింది. దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు చేస్తున్న కృషి గురించి చెప్పడం.. పనిని పెంచడం వంటి అంశాలు ఈ ఉత్సవంలో చర్చించబడ్డాయి.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం