Bank Accounts: అధిక బ్యాంకు అకౌంట్లు ఉంటే జరిమానా బాదుడు..? పీఐబీ క్లారిటీ ఇదే..!

| Edited By: Ram Naramaneni

Aug 11, 2024 | 8:34 PM

ముఖ్యంగా వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల సేవలను అందుకోవడానికి బ్యాంకు ఖాతా తప్పనిసరి. వేలాది మంది ప్రజలకు వివిధ ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులలో ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను కలిగి ఉంటున్నాయి. అయితే ఇటీవల సోషల్ మీడియాలో ఒక సందేశం వైరల్ అయ్యింది. ఇది ప్రజలలో ఆందోళనకు కారణమైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాల ప్రకారం ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో ఖాతాలు కలిగి ఉన్న వ్యక్తులపై ఇప్పుడు జరిమానా విధిస్తారనే వార్త వైరల్‌గా మారింది.

Bank Accounts: అధిక బ్యాంకు అకౌంట్లు ఉంటే జరిమానా బాదుడు..? పీఐబీ క్లారిటీ ఇదే..!
Bank Accounts
Follow us on

ప్రపంచవ్యాప్తంగా పెరిగిన టెక్నాలజీ కారణంగా బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పులు వచ్చాయి. భారతదేశంలో అయితే అనేక బ్యాంకులు ఉన్న కారణంగా ప్రతి ఒక్కరికీ రెండు నుంచి మూడు బ్యాంకు అకౌంట్లు ఉంటున్నాయి. ముఖ్యంగా వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల సేవలను అందుకోవడానికి బ్యాంకు ఖాతా తప్పనిసరి. వేలాది మంది ప్రజలకు వివిధ ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులలో ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను కలిగి ఉంటున్నాయి. అయితే ఇటీవల సోషల్ మీడియాలో ఒక సందేశం వైరల్ అయ్యింది. ఇది ప్రజలలో ఆందోళనకు కారణమైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాల ప్రకారం ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో ఖాతాలు కలిగి ఉన్న వ్యక్తులపై ఇప్పుడు జరిమానా విధిస్తారనే వార్త వైరల్‌గా మారింది. ఈ వార్త ఫేక్ అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తేల్చింది. ఈ నేపథ్యంలో పీఐబీ ఇచ్చిన క్లారిటీ గురించి ఓ సారి తెలుసుకుందాం. 

భారత ప్రభుత్వ ప్రెస్ ఏజెన్సీ, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఈ వైరల్ సందేశం వెనుక ఉన్న వాస్తవాన్ని వెల్లడించింది. కొన్ని కథనాలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాల ప్రకారం ఇప్పుడు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో ఖాతాను ఉంచినందుకు జరిమానా విధించబడుతుందని ఈ అపోహ వ్యాప్తి చెందుతుందని, ఆర్‌బీఐ అటువంటి మార్గదర్శకాలు ఏవీ జారీ చేయలేదరని స్పష్టం చేసింది. ప్రజలు ఇలాంటి వైరల్ మెసేజ్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. 

పీఐబీ ఇంటర్నెట్‌లో త్వరగా వ్యాపించే ఇలాంటి వార్తలను ఏజెన్సీ నిరంతరం పర్యవేక్షిస్తుంది. సరైన వాస్తవ తనిఖీ కోసం ఎవరైనా అలాంటి వార్తలను  ప్రజలు పీఐబీకు కూడా పంపవచ్చు. ప్రభుత్వానికి సంబంధించిన ఏవైనా వార్తలు లేదా మార్గదర్శకాలను ధ్రువీకరించడానికి పీఐబీ ఫాక్ట్ చెక్ సేవను కూడా ఉపయోగించవచ్చు. అలా చేయాలనుకునే వ్యక్తి తప్పుదోవ పట్టించే వార్తల స్క్రీన్‌షాట్, ట్వీట్, ఫేస్‌బుక్ పోస్ట్ లేదా యూఆర్ఎల్‌ను పీఐబీ ఫాక్ట్ చెక్ వాట్సాప్ నంబర్ 8799711259కి పంపవచ్చు లేదా factcheck@pib.gov.inకి ఈ-మెయిల్ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..