GST Rules: కొత్తసంవత్సరంలో జీఎస్టీ మోత.. బట్టలు.. ఆటోరైడ్‌లు మరింత భారం!

 కొత్త సంవత్సరం ప్రారంభంలోనే జీఎస్టీ భారం పడనుంది. వస్తుసేవల పన్ను (GST) చెల్లింపుపై విధానపరమైన మార్పులను తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధం అయింది.

GST Rules: కొత్తసంవత్సరంలో జీఎస్టీ మోత.. బట్టలు.. ఆటోరైడ్‌లు మరింత భారం!
Gst Ru;es

Updated on: Dec 28, 2021 | 2:25 PM

GST Rules: కొత్త సంవత్సరం ప్రారంభంలోనే జీఎస్టీ భారం పడనుంది. వస్తుసేవల పన్ను (GST) చెల్లింపుపై విధానపరమైన మార్పులను తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధం అయింది. ఈ కామర్స్ వెబ్ సైట్ లనుంచి జరిపే కొనుగోళ్ల నుంచి ఆటో రైడ్ ల వరకూ.. అలాగే చెప్పుల నుంచి మొదలు పెట్టి దుస్తుల వరకూ రాబోయే జనవరి 1 నుంచి ధరల మోత మొగిస్తాయి. జనవరి 1, 2022 నుండి మారుతున్న అన్ని GST పన్ను నిబంధనలను గురించి తెల్సుకుందాం.
దుస్తులు, పాదరక్షలు మరింత ప్రియం

దుస్తులు, పాదరక్షలు , రెడీమెడ్ వస్త్రాలు వంటి వస్తువులు జనవరి 1, 2022 నుండి ఖరీదైనవిగా మారతాయి, కేంద్ర ప్రభుత్వం అటువంటి వస్తువులపై GSTని 5% నుండి 12%కి పెంచింది. రూ.1,000 వరకు ధర ఉండే దుస్తులపై జీఎస్టీ రేటు 5% నుంచి 12%కి పెరిగింది. నేసిన వస్త్రాలు, సింథటిక్ నూలు, దుప్పట్లు, టెంట్లు, అలాగే టేబుల్‌క్లాత్‌లు లేదా సర్వియెట్‌లు వంటి ఉపకరణాలతో సహా వస్త్రాల ధరలు కూడా 5% నుంచి 12%కి పెంచారు. పాదరక్షలపై జీఎస్టీ రేటు (ఒక జతకు రూ. 1,000 వరకు ఉంటుంది) కూడా 5% నుండి 12%కి పెరిగింది.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) నవంబర్ 18న పెంపుడలను తెలియజేసింది. దుస్తులపై GSTని పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల నిరాశ వ్యక్తం చేస్తూ, ఈ పెంపు పరిశ్రమపై ప్రభావం చూపుతుందని భారత వస్త్ర తయారీదారుల సంఘం (CMAI) తెలిపింది. ముడిసరుకు ధరలు, ముఖ్యంగా నూలు, ప్యాకింగ్ మెటీరియల్, సరకు రవాణాపై ద్రవ్యోల్బణ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

ఓలా, ఉబెర్ ద్వారా ఆటో రైడ్‌లు మరింత ప్రియం..

ఓలా..ఉబర్ వంటి యాప్ అగ్రిగేటర్ల ద్వారా బుక్ చేసుకునే ఆటో రిక్షా రైడ్‌లు కూడా కొత్త సంవత్సరంలో మరింత ఖరీదైనవిగా మారనున్నాయి. జనవరి 1 నుండి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే ఆటో రైడ్‌లపై ఇప్పటికే ఉన్న మినహాయింపును ముగించి 5% జిఎస్‌టి విధించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీధుల నుంచి తీసుకునే ఆటో రైడ్‌లు GST రహితంగా కొనసాగుతాయి.

ఆదాయాన్ని సేకరించాల్సిన అవసరాన్ని కంపెనీ అభినందిస్తున్నప్పటికీ, ఈ పన్నును పునఃపరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఉబెర్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇది ఆటో డ్రైవర్ల ఆదాయాలను అలాగే ప్రభుత్వ డిజిటలైజేషన్ ఎజెండాను ప్రభావితం చేస్తుంది.

ఈ-కామర్స్ కంపెనీలకు పన్ను భారం బదలాయింపు

జనవరి 1 నుండి, ఫుడ్ డెలివరీ యాప్‌లు తాము చేసే డెలివరీల కోసం రెస్టారెంట్‌ల స్థానంలో 5% జిఎస్‌టిని సేకరించి ప్రభుత్వం వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇది విధానపరమైన మార్పు, తుది వినియోగదారుపై అదనపు పన్ను భారం ఉండదు. ఇంతకు ముందు రెస్టారెంట్లు జీఎస్టీని చెల్లించేవి. ఇప్పుడు, రెస్టారెంట్లకు బదులుగా, జొమాటో, స్విగ్గీ వంటి అగ్రిగేటర్లు పన్ను చెల్లించవలసి ఉంటుం. ఇది ఆదాయ లీకేజీని కూడా నిరోధించగలదని ప్రభుత్వం తెలిపింది.

ఇవి కూడా చదవండి: Maoist vs Police: మావోయిస్టులపై పోలీసులు ప్రతీకారం తీర్చుకున్నారా? ఆ హత్యకు, ఎన్‌కౌంటర్‌కు సంబంధం ఉందా?

Harassment: రెచ్చిపోయిన కీచకులు.. 15 ఏళ్ల బాలికను వేరు వేరు ప్రాంతాలు తిప్పుతూ..

Viral Video: కళ్లను మాయ చేస్తున్న తొమ్మిదో వింత.. అచ్చం చెక్క ముక్కలా..

Loading...
Unable to load recommendations.
Follow Us