
స్టాక్ థార్ 650 ఎంఎం లోతు నీటిలోనూ నడిచే సామర్థ్యం కలిగి ఉందని మహీంద్ర కంపెనీ వెల్లడించింది. ఇటీవల కాలంలో అకాల వర్షాలు భారీ స్థాయిలో కురుస్తున్నాయి. దీంతో రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. నగరాల్లోని రోడ్లన్నీ ముంపునకు గురవుతున్నాయి. అలా వరద నీరు నిండిన ఓ రోడ్డుపై దూసుకుపోతున్న థార్ ఎస్ యూవీ వీడియో వైరల్ గా మారింది. అయితే నిర్ణీత స్థాయికి మించిన నీటిలో ప్రయాణం చేయకూడదని కంపెనీ తెలిపింది. ముఖ్యంగా నీటి మట్టం కారు గ్రిల్ ను మించకూడదు. ఎందుకంటే ఇంజిన్ సక్రమంగా పనిచేయాలంటే గాలి అవసరం. గాలిని లోపలకు తీసుకునేందుకు ఎయిర్ ఇన్ టెక్ ఉంటాయి. ఇంజిన్ సక్రమంగా పనిచేయడానికి అవి చాాలా అవసరం.
సాధారణంగా వరద నీటితో నిండిన రోడ్లపై కారు ప్రయాణం చేసినప్పుడు నీరు ఇంజిన్ లోకి ప్రవేశించి ప్రమాదం ఉంది. దీని వల్ల దాని పనితీరుకు ఆటంకం కలుగుతుంది. పిస్టన్ సీజర్ కారణంగా ఇంజిన్ నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఈ రకమైన స్థితినే హైడ్రో లాక్ అని పిలుస్తారు. ఈ పరిస్థితిలో వాహనం విద్యుత్ భాగాలు పాడైపోతాయి. మహీంద్ర నుంచి విడుదలైన థార్ లైఫ్ స్లైల్ ఎస్ యూవీకి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. అన్ని రకాల రోడ్లపై చక్కగా పరుగులు తీస్తుంది. దీని ధర రూ.13.16 లక్షల నుంచి రూ.17.62 లక్షల ఉంటుంది. ప్రస్తుత మార్కెట్ లో ఉన్న మారుతీ సుజుకి జిమ్నీ, ఫోర్స్ గూర్ఖా తదితర మోడళ్లకు గట్టి పోటీ ఇస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..