
మీ ఉద్యోగం పోయిందా..? లేదా ఉద్యోగం మానేశారా..? అయితే మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్ధిక సాయం పొందవచ్చు. అవును.. చాలామందికి ఈ విషయం తెలియక డబ్బులు పొందలేకపోతున్నారు. ఇటీవల లేఆఫ్స్ ఎక్కువ అవ్వడంతో పాటు వివిధ కారణాలతో ఉద్యోగాలు మానేసేవారు కూడా పెరిగిపోతున్నారు. ఇలాంటి సమయంలో ఉద్యోగం లేకపోవడంతో ఆర్ధికంగా కష్టాలు తప్పవు. ఇలాంటివారికి అండగా నిలిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన పథకాన్ని అమలు చేస్తోంది

ఈ పథకం ఎప్పటినుంచో అమలవుతుండగా.. ఇటీవల 2027 జూన్ 30వ తేదీ వరకు కేంద్రం పొడిగించింది. ఎంప్లాయిస్ స్టేట్ ఇన్యూరెన్స్(ఈఎస్ఐ) సౌకర్యం ఉండే ప్రతీఒక్క ఉద్యోగికి ఈ స్కీమ్ వర్తిస్తుంది. స్టే్ట్ ఇన్యూరెన్స్ బీమా కార్పొరేషన్ ఈ పథకాన్ని నిర్వహిస్తోంది. మీకు ఈఎస్ఐ ఉండి ఉద్యోగం కోల్పోయినా లేదా మానేసినా కేంద్ర ప్రభుత్వం నుంచి నిరుద్యోగ భృతి పొందవచ్చు. ఈ ఏడాది జూన్ 30న ఈ స్కీమ్ గడువు ముగియగా.. కేంద్రం ఏడాది పాటు పొడిగించింది.

ఉద్యోగం మానేశాక కొత్త ఉద్యోగం వెతుక్కునేందుకు సమయం పడుతుంది. దీంతో ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొకూడదనే ఉద్దేశంతో కేంద్రం సాయం అందిస్తోంది. ఈఎస్ఐ పరిధిలో ఉన్న ఉద్యోగులందరూ దీని ద్వారా ప్రయోజనం పొందవచ్చు. మీ చివరి శాలరీలో సగం నిరుద్యోగ భృతిగా అందిస్తారు. ఉద్యోగం కోల్పోయిన తర్వాత మూడు నెలల వరకు అందిస్తారు. తమ జీతంలో 50 శాతం వరకు పొందవచ్చు

ఇక ఈఎస్ఐ అనేది ఉద్యోగి కోల్పోయిన ఆరు నెలల వరకు వర్తిస్తుంది. రూ.21వేలలోపు జీతం ఉన్నవారు ఈ పరిధిలోకి వస్తారు. ఈ సాయం పొందేందుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మీ అర్హతను పరిశీలించి నేరుగా అకౌంట్లలో సాయాన్ని జమ చేస్తారు. కానీ చాలామందికి ఈ స్కీమ్ గురించి తెలియక ఉపయోగించుకోలేకపోతున్నారు.

ఇటీవల కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా ఆధ్వర్యంలో ఈఎస్ఐసీ 198వ సమావేశం జరిగింది. ఈ మీటింగ్లో పథకం గుడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయుష్ సేవలను కూడా ఈఎస్ఐలో జోడించనున్నారు. ఒక కొత్త ఉప ప్రాంతీయ కార్యాలయాలను అందుబాటులోకి తీసుకురానున్నారు.