Jeet Adani Wedding: ఆదానీ కుమారుడిని పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరో తెలుసా?

Jeet Adani Wedding: అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ కుమారుడు జీత్ వివాహం వచ్చే నెలలో జరగనుంది. జీత్ అదానీ 7 ఫిబ్రవరి 2025న దివా షాను వివాహం చేసుకోనున్నారు. అయితే దేశంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన గౌతమ్ అదానీ కుమారుడి పెళ్లి ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది..

Jeet Adani Wedding: ఆదానీ కుమారుడిని పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరో తెలుసా?

Updated on: Jan 22, 2025 | 6:33 PM

జీత్ అదానీ వెడ్డింగ్: ప్రపంచ ప్రఖ్యాత భారతీయ వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ ఇంట్లో పెళ్లి వేడుక జరగనుంది. ఆదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ ఫిబ్రవరి 7న దివా జైమిన్ షాతో వివాహం చేసుకోబోతున్నారు. వీరిద్దరూ గతేడాది అహ్మదాబాద్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. వారి ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ డిసెంబర్ 10-11 తేదీలలో ఉదయపూర్‌లో జరిగింది. ఇప్పుడు పెళ్లికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే గౌతమ్ అదానీకి కాబోయే చిన్న కోడలు ఎవరో తెలుసా? ఆమె ఏ కుటుంబానికి చెందినదో తెలుసా?

దివా జమిన్ షా ఎవరు?

దివా సూరత్‌లోని పెద్ద వ్యాపారవేత్త జైమిన్ షా కుమార్తె. అతను సి దినేష్ అండ్‌ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని. అతని వ్యాపారం సూరత్ నుండి ముంబై వరకు విస్తరించి ఉంది. కంపెనీ డెలివరీ కార్యాలయాలు నెదర్లాండ్స్, హాంకాంగ్‌లో ఉన్నాయి. ఈ కంపెనీకి పునాది 1976లో చినుభాయ్ దోషి, దినేష్‌భాయ్ షా పునాది వేయగా, ఇప్పుడు జైమిన్ షా దీనికి డైరెక్టర్‌గా ఉన్నారు. దివా జైమిన్ షా సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండరు. కానీ మీడియా నివేదికల ప్రకారం, దివాకు వ్యాపారం, ఫైనాన్స్‌పై మంచి పట్టు ఉంది. అంతే కాదు, ఆమె తన తండ్రికి వ్యాపార పనులలో కూడా సహాయం చేస్తుంది. అలాగే, దివా లైమ్‌లైట్‌కు దూరంగా ఉండటానికి ఇష్టపడుతుంది.

అదానీ గ్రూప్‌లో జీత్ పాత్ర:

ఇదిలా ఉండగా, ఆదానీ కుమారుడు జీత్ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. 2019లో అదానీ గ్రూప్‌లో చేరడానికి ముందు, అతను ఫైనాన్స్, క్యాపిటల్ మార్కెట్స్, రిస్క్ అండ్ పాలసీలో పనిచేశాడు. అదానీ గ్రూప్ వెబ్‌సైట్ ప్రకారం, అదానీ పోర్ట్స్, అదానీ డిజిటల్ ల్యాబ్స్ వంటి విభాగాల పనిని జీత్ నిర్వహిస్తుంది. ప్రస్తుతం అదానీ ఎయిర్‌పోర్ట్స్ డైరెక్టర్‌గా ఉన్నారు.

పెళ్లి సింపుల్‌గా ఉంటుంది: గౌతమ్ అదానీ

జీత్, దివా వివాహం చాలా గ్రాండ్‌గా జరగబోతోందని, దీనికి భారతదేశం, విదేశాల నుండి చాలా మంది ప్రముఖులు హాజరు కాబోతున్నారని మీడియా నివేదికలలో పేర్కొన్నారు. అయితే మహాకుంభానికి చేరుకున్న తర్వాత గౌతమ్ అదానీ మీడియాతో మాట్లాడుతూ.. పెళ్లిని సాదాసీదాగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించబోతున్నట్లు తెలిపారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us