
Insurance: అధిక ప్రీమియం కారణంగా చాలా మంది బీమా తీసుకోలేరు. అటువంటి పరిస్థితిలో మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకం సామాన్య ప్రజలకు ఎంతో మేలు కలుగుతోంది. పేదలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు తీసుకువచ్చింది. వాటిలో ఒకటి ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY). ఈ పథకం కింద పాలసీదారుడు రూ.2 లక్షల బీమా కవర్ పొందుతారు. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే వారు ఈ కవర్ కోసం ఖరీదైన ప్రీమియంలు చెల్లించాల్సిన అవసరం లేదు. బదులుగా వారు ప్రతి సంవత్సరం కేవలం రూ.20 మాత్రమే చెల్లించాలి. ఈ బీమా పథకం ప్రయోజనాన్ని ఎవరు? ఎలా పొందవచ్చో తెలుసుకుందాం.
ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన అనేది భారత ప్రభుత్వం ప్రారంభించిన సామాజిక భద్రతా పథకం. ఇది తక్కువ ఆదాయ ప్రజలకు ప్రమాద బీమా రక్షణను అందిస్తుంది. ఇది భారత ప్రభుత్వం పేదల కోసం ప్రారంభించిన బీమా పథకం. ఈ పథకం కింద ఎవరైనా ప్రమాదం కారణంగా మరణిస్తే లేదా అంగవైకల్యానికి గురైతే వారికి రూ.2 లక్షల వరకు కవరేజ్ లభిస్తుంది. ఈ పథకానికి వార్షిక ప్రీమియం రూ.20, అంటే నెలవారీ ఖర్చు రూ.2 కంటే తక్కువగా ఉంటుంది.
ఇది కూడా చదవండి: 2026 Holidays List: ఉద్యోగులు, విద్యార్థుల గుడ్న్యూస్.. వచ్చే ఏడాది భారీగా సెలవులు.. జాబితా విడుదల
ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY)లో చేరడానికి, వ్యక్తులు 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
ఈ పథకానికి ఏదైనా బ్యాంకు లేదా పోస్టాఫీసులో పొదుపు ఖాతా అవసరం. మీకు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటే, మీరు ఒకదానితో మాత్రమే నమోదు చేసుకోవచ్చు.
బీమా ప్రీమియం మీ ఖాతా నుండి ఆటో-డెబిట్ వ్యవస్థ ద్వారా స్వయంచాలకంగా డెబిట్ అవుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి