AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: భారత్‌లో అతి పురాతనమైన రైల్వే స్టేషన్లు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా?

Indian Railways: మన భారతీయ రైల్వేకు ప్రత్యేక స్థానముంది. రవాణా వ్యవస్థలో అతిపెద్దది. ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఇందు కోసం రైల్వే శాఖ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూనే ఉంటుంది. అలాగే రైల్వే అతి పురాతనమైన స్టేషన్‌లు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..

Indian Railways: భారత్‌లో అతి పురాతనమైన రైల్వే స్టేషన్లు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా?
8750001323: రైలులో కూర్చున్నప్పుడు మీకు ఆకలిగా అనిపిస్తే, చింతించకండి. మీరు మీ సీటు నుండే ఫుడ్ ఆర్డర్ చేయవచ్చు. దీని కోసం మీరు మీ ఫోన్‌లో ఈ నంబర్‌ను సేవ్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత వాట్సాప్‌లో మెసేజ్‌ పంపాలి. మీరు ఆన్-స్క్రీన్ సూచనలు, ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు.
Subhash Goud
|

Updated on: Nov 03, 2024 | 4:32 PM

Share

ఇండియన్‌ రైల్వే.. భారతదేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ. ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది. రైళ్ల ద్వారా ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణిస్తున్నారు. అయితే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని రైల్వే ఎప్పటికప్పుడు సదుపాయాలను మెరుగు పరుస్తుంటుంది. భారత రైల్వేలో ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. కొన్ని రైల్వేస్టేషన్‌లు అతి పొడవైన రైల్వే స్టేషన్‌లుగా గుర్తింపు పొందుతుంటే మరి కొన్ని స్టేషన్‌లకు ప్రత్యేక స్థానముంది. అలాగే మన దేశంలో అతి పురాతనమైన రైల్వే స్టేషన్‌లు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: UPI Services: ఈ నెలలో రెండు రోజులు యూపీఐ సేవలు బంద్‌.. ఎందుకో తెలుసా?

  1. ముంబై: ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినల్‌. ఈ స్టేషన్‌ను 1950లో నిర్మించారు. గతంలో బోరి బందర్‌, విక్టోరియా టెర్మినల్‌ అని పిలిచేవారు. ఇది దేశంతో పురాతనమైన స్టేషన్‌గా ప్రసిద్ధి చెందిందని రైల్వే నివేదికల ద్వారా తెలుస్తోంది. ఇక ప్యాసింజర్‌ విషయానికొస్తే దేశంలో మొట్టమొదటి ప్యాసింజర్‌ రైలు 1953లో బోరి బందర్‌ నుంచి థానే వరకు నడిచింది. 1887లో విక్టోరియా టెర్మినల్‌, 1996లో ఛత్రపతి శివాజీ టెర్మినల్‌గా మార్చారు.
  2. బెంగాల్‌లో.. 1852లో నిర్మించిన బెంగాల్‌లోని హౌరా రైల్వే స్టేషన్‌ భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్‌లలో ఒకటిగా ఉంది. ఇక్కడ ఎప్పుడు చూసినా ప్రయాణికుల రద్దీ అధికాంగా ఉంటుంది. ప్రతి రోజు లక్షలాది మంది ఈ స్టేషన్‌ నుంచి ప్రయాణాలు కొనసాగిస్తారని నివేదికలు చెబుతున్నాయి.
  3. ఇవి కూడా చదవండి
  4. హౌరా స్టేషన్‌: ఈ హౌరా స్టేషన్‌లో 23 ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. అలాగే భారతదేశంలోని ఏ స్టేషన్‌లోనూ గరిష్ట సంఖ్యలో ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి.
  5. రాయపురం: చెన్నైలోని రాయపురం భారతదేశంలోని పురాతన రైల్వే స్టేషన్‌లలో ఒకటి. ఈ రైల్వే స్టేషన్‌ను 1856లో నిర్మాణం చేపట్టారు.
  6. తమిళనాడు: దక్షిణ భారతదేశంలో మొదటి రైలు సర్వీసు1 జూలై 1856న తమిళనాడులోని ఆర్కాట్‌లోని రోయపురం నుంచి వాలాజా రోడ్‌ వరకు నడిచింది.
  7. జైపూర్‌: జైపూర్‌ జంక్షన్‌ రైల్వే స్టేషన్‌. ఇది పురాతనమైనది. దీనిని 1875లో నిర్మించారు. ఇది ఇప్పుడు రాజస్థాన్‌లో అత్యంత రద్దీగాఉండే స్టేషన్‌.
  8. పుదుచ్చేరి: ఇక భారతదేశంలో పురాతనమైన రైల్వే స్టేషన్‌లలో పుదుచ్చేరి రైల్వే స్టేషన్‌ ఒకటి. దీనిని 1879లో నిర్మించారు. దేశంలో పురాతనమైన రైల్వే స్టేషన్‌లలో ఇదొకటి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి