
Scotch Whisky: భారత్-బ్రిటన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల దేశంలో దిగుమతి చేసుకున్న మద్యం మార్కెట్లో గణనీయమైన మార్పులు రానున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా, స్కాచ్ విస్కీ, జిన్పై విధించే దిగుమతి సుంకాన్ని 150 శాతం నుండి 75 శాతానికి తగ్గించారు. రాబోయే పది సంవత్సరాలలో ఈ సుంకాన్ని దశలవారీగా 40 శాతానికి తగ్గించే ప్రణాళిక కూడా ఉంది.
ఈ నిర్ణయం వల్ల విదేశీ మద్యం ధరలు తగ్గుతాయని, ముఖ్యంగా ప్రీమియం స్కాచ్ విస్కీ ధర 15 నుండి 20 శాతం వరకు తగ్గవచ్చని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫలితంగా, వినియోగదారులకు మరిన్ని ఎంపికలు అందుబాటులోకి వస్తాయి. దేశీయ ప్రీమియం విస్కీ మార్కెట్లో పోటీ పెరుగుతుంది.
అయితే, మద్యం బాటిల్ తుది ధరలో రాష్ట్ర ప్రభుత్వాల ఎక్సైజ్ సుంకం, వ్యాట్, రవాణా ఖర్చులు, డిస్ట్రిబ్యూటర్ మార్జిన్లు కీలక పాత్ర పోషిస్తాయి. దిగుమతి సుంకం తగ్గింపు ప్రయోజనం వెంటనే వినియోగదారులకు పూర్తిగా చేరకపోవచ్చు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద విస్కీ మార్కెట్గా ఉంది. ఈ ఒప్పందం ద్వారా ప్రీమియం మద్యం వినియోగం పెరుగుతుందని, భారతీయ కంపెనీలు కూడా తమ ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరుచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. స్కాచ్ దిగుమతి చేసుకొని విస్కీ తయారు చేసే భారతీయ కంపెనీలు కూడా ఈ మార్పుల వల్ల లాభపడతాయి.
ఇది కూడా చదవండి: Flipkart Sale: ఫ్లిప్కార్ట్ ప్రియులకు సూపర్ న్యూస్.. ఆగస్టులో భారీ సేల్ ప్రారంభం.. ఆఫర్ల ధమాకా..!
ఇది కూడా చదవండి: Gold, Silver Prices: రికార్డు స్థాయిల నుంచి దిగొచ్చిన గోల్డ్, సిల్వర్.. తులం బంగారంపై రూ. 13 వేలు, వెండిపై రూ. 45 వేలు డౌన్!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి