Aadhaar Card: ఆధార్ కార్డ్‌తో కూడా మీ బ్యాంక్ బ్యాలెన్స్‌ చెక్ చేసుకోవచ్చు.. ఎలానో తెలుసా..

|

Sep 05, 2022 | 9:59 PM

బ్యాంకు ఖాతాతో పాటు పాన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేస్తున్నారు. అయితే, 12 అంకెల ఆధార్ కార్డ్ నంబర్ సహాయంతో మీరు ATMకు వెల్లకుండానే మీ బ్యాంక్ ఖాతా బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవచ్చు.

Aadhaar Card: ఆధార్ కార్డ్‌తో కూడా మీ బ్యాంక్ బ్యాలెన్స్‌ చెక్ చేసుకోవచ్చు.. ఎలానో తెలుసా..
Follow us on

ఆధార్ కార్డ్ ఒక ప్రధాన పత్రం. ఇది ఆధునిక కాలంలో అనేక ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది. ఆధార్ కార్డు గుర్తింపు రుజువు, చిరునామా రుజువు కోసం మాత్రమే కాకుండా.. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను తీసుకోవడానికి కూడా ఉపయోగించబడుతుంది. అదే సమయంలో, బ్యాంకు ఖాతా తెరవడానికి, బ్యాంకింగ్ సేవలను పొందేందుకు కూడా ఆధార్ కార్డు తప్పనిసరి చేయబడింది. బ్యాంకు ఖాతాతో పాటు పాన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేస్తున్నారు. అయితే, 12 అంకెల ఆధార్ కార్డ్ నంబర్ సహాయంతో.. మీరు ఏ ATM సెంటర్‌కు వెల్లకుండానే మీ బ్యాంక్ ఖాతా బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించని లేదా ఆధార్‌ను ఇంట్లో కూర్చొని బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలనుకునే వారికి ఈ సౌకర్యం ప్రయోజకరంగా ఉంటుంది.

మీరు ఆధార్ కార్డ్‌తో బ్యాంక్ బ్యాలెన్స్‌ని చెక్ చేయాలనుకుంటే.. మీరు ఆధార్ నుంచి బ్యాంక్ బ్యాలెన్స్‌ని ఎలా చెక్ చేసుకోవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.. ఇందుకోసం ఆధార్ కార్డుతో పాటు మొబైల్ నంబర్ కూడా ఉండాలి.

ఆధార్ కార్డ్‌తో బ్యాంక్ ఖాతా బ్యాలెన్స్‌ని ఇలా చెక్ చేసుకోండి

  • ముందుగా బ్యాంక్ ఖాతాతో నమోదు చేసుకున్న మీ మొబైల్ నంబర్ నుండి 9999*1# డయల్ చేయండి.
  • ఇప్పుడు 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి .
  • ఆ తర్వాత మీ ఆధార్ నంబర్‌ను మళ్లీ నమోదు చేయడం ద్వారా ధృవీకరించండి.
  • మీకు UIDAI నుంచి స్క్రీన్‌పై ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్‌తో ఫ్లాష్ SMS వస్తుంది.

ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవచ్చు

మీరు 12 అంకెల ఆధార్ నంబర్‌ను ఉపయోగించి బ్యాంక్ బ్యాలెన్స్‌ను తనిఖీ చేయడమే కాకుండా.. యూజర్ల ఇతర పనులను కూడా చేయవచ్చు. ఆధార్ సహాయంతో, మీరు డబ్బు పంపవచ్చు, ప్రభుత్వ సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు లేదా ఆధార్ కార్డు సహాయంతో పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్ కేంద్రాన్ని సందర్శించడం ద్వారా ఆధార్ నుండి డబ్బును తీసుకోవచ్చు.

UIDAI ఇటీవల మీ ఫోన్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేయడం.. ఇతర వివరాలను అప్‌డేట్ చేయడం వంటి డోర్‌స్టెప్ సేవలను అందించడానికి ప్లాన్ చేస్తోంది. ఈ సేవతో, ప్రజలు ఆధార్ సేవకు వెళ్లవలసిన అవసరం లేదు. ఈ సేవలను పొందేందుకు UIDAI ప్రస్తుతం 48,000 మంది ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ పోస్ట్‌మెన్‌లకు శిక్షణనిస్తోంది. ఆ తర్వాత పోస్ట్‌మ్యాన్ ద్వారా మీ ఇంటికి ఆధార్ సేవలు అందజేయబడతాయి.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం