AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Story: మిర్చి సాగుతో రూ. 1.50కోట్ల ఆదాయం.. ఎనిమిదో తరగతి చదివిన రైతు సక్సెస్ స్టోరీ..

ఓ వ్యక్తి మాత్రం తాను కేవలం ఎనిమిదో తరగతి వరకూ మాత్రమే చదివి ఏడాదికి రూ. 90 లక్షలు ఆర్జిస్తున్నాడు. అది వ్యవసాయం ద్వారానే. ఆశ్చర్యంగా ఉంది కదూ. అదెలా సాధ్యమని అనుకుంటున్నారా? అయితే కేవలం ఎనిమిదో తరగతి వరకూ మాత్రమే చదివి వ్యవసాయంతో కోటీశ్వరుడిగా మారిన ధర్మేష్ భాయ్ మాతుకియా అనే రైతు గురించి తెలుసుకోవాల్సింది.

Success Story: మిర్చి సాగుతో రూ. 1.50కోట్ల ఆదాయం.. ఎనిమిదో తరగతి చదివిన రైతు సక్సెస్ స్టోరీ..
Mirchi Cultivation
Madhu
|

Updated on: Jan 27, 2024 | 7:40 AM

Share

మన సమాజంలో వ్యవసాయంపై గౌరవం ఉన్నా.. దానిని కెరీర్ గా ఎంచుకోవడానికి చాలా మంది వెనుకాడతారు. ఎందుకంటే కచ్చితమైన రాబడి ఉండదు.. దిగుబడి ప్రకృతిపై ఆధార పడి ఉంటుంది.. మళ్లీ తెగుళ్ల బెడద.. వెరసి కొన్ని సందర్భాల్లో పెట్టుబడి కూడా రాని పరిస్థి ఉంటుంది. ఇలాంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రస్తుత యువత అంతగా ఆసక్తి చూపడం లేదు. ఏదైనా ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థ డిగ్రీ, పీజీ చేసేయడం.. మంచి ఉద్యోగం సంపాదించి నెలకు రూ. లక్షల్లో సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో అగ్రికల్చర్ వైపు మళ్లడానికి అంతగా ఆసక్తి చూపడం లేదు. అయితే ఓ వ్యక్తి మాత్రం తాను కేవలం ఎనిమిదో తరగతి వరకూ మాత్రమే చదివి ఏడాదికి రూ. 90 లక్షలు ఆర్జిస్తున్నాడు. అది వ్యవసాయం ద్వారానే. ఆశ్చర్యంగా ఉంది కదూ. అదెలా సాధ్యమని అనుకుంటున్నారా? అయితే కేవలం ఎనిమిదో తరగతి వరకూ మాత్రమే చదివి వ్యవసాయంతో కోటీశ్వరుడిగా మారిన ధర్మేష్ భాయ్ మాతుకియా అనే రైతు గురించి తెలుసుకోవాల్సింది.

మిరప సాగుతో రూ. కోట్లు..

గుజరాత్‌లోని అమ్రేలి జిల్లా అమ్రాపూర్ గ్రామానికి చెందిన ధర్మేష్ భాయ్ మాతుకియా అనే నిబద్ధత కలిగిన రైతు అద్భుతమైన విజయాన్ని సాధించాడు. అతను 38 బిగాస్(దాదాపు 24 ఎకరాల) భూమిలో మిర్చి సాగు చేశాడు. గణనీయమైన దిగుబడిని సాధించాడు. దానిని కాయలుగానే విక్రయించకుండా మిరప పొడిని ప్రాసెస్ చేశాడు. దానిని ప్రపంచ మార్కెట్‌లకు ఎగుమతి చేస్తూ ఏకంగా ఏడాదికి రూ. 1.50 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. ఖర్చులు పోనూ రూ. 90 లక్షల వార్షిక ఆదాయాన్ని పొందుతున్నట్లు ధర్మేష్ ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన 38 బిగాస్ భూమిలో ప్రతి సంవత్సరం సుమారు 60 వేల కిలోల మిర్చి దిగుబడి వస్తుందని ఆయన చెప్పాడు. ధర్మేష్ ఆదాయాన్ని అంచనా వేస్తే, రిటైల్ మార్కెట్‌లో కిలోకు రూ.500 నుంచి రూ.600 వరకు ఉన్న మంచి నాణ్యమైన ఎర్ర మిర్చి ప్రస్తుత మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకుంటే, ధర్మేష్ హోల్‌సేల్ మార్కెట్‌లో కిలోకు రూ. 250 చొప్పున లభిస్తే, అతని మొత్తం ఆదాయం రూ. 60 వేల నుంచి రూ.1.5 కోట్ల వరకూ ఉంటుంది.

ఆ ప్రాంతంలో రైతులందరిదీ అదే బాట..

అమ్రేలి జిల్లా పరిధిలోని కుంకవావ్ తాలూకాలోని అమ్రాపూర్ గ్రామంలో ఎక్కువ మంది రైతులు మిర్చి సాగులో చురుకుగా పాల్గొంటున్నారు. మిర్చి ఉత్పత్తిని పెంచడానికి రైతులు వివిధ పద్ధతులను అన్వేషించడంతో ఈ ప్రాంతం వ్యవసాయ ప్రయోగాలకు కేంద్రంగా మారింది. ఈ విజయ కథలలో, విశేషమైన ఫలితాలను సాధించడంలో ధర్మేష్ ప్రత్యేకంగా నిలుస్తాడు. అతని సమర్థవంతమైన వ్యవసాయ పద్ధతులు గుర్తింపు పొందడమే కాకుండా పొరుగు గ్రామాల రైతుల దృష్టిని ఆకర్షించాయి.

ఇవి కూడా చదవండి

అదే ప్రాంతానికి చెందిన ఎనిమిదో తరగతి చదివిన 45 ఏళ్ల రైతు ధర్మేష్ భాయ్ మాతుకియా గత ఐదేళ్లుగా మిర్చి సాగు చేస్తున్నాడు. కాశ్మీరీ డబ్బి వంటి రకాలను నాటడం ఆయన ప్రత్యేకత. ఈ సీజన్‌లో, అతను 38 బిగాస్ భూమిని సాగుకు కేటాయించాడు. ఫలితంగా 60 వేల కిలోల దిగుబడి వచ్చింది. మొత్తం మిరపకాయలను విక్రయించడం కంటే, అతను వాటిని పౌడర్‌గా ప్రాసెస్ చేయడం మేలని భావించి, అలా చేస్తున్నాడు. అంతేకాక ఆ పౌడర్ ను స్వయంగా విక్రయిస్తున్నాడు. కాశ్మీరీ మిర్చి పౌడర్ కిలో రూ.450 పలుకుతుండగా, కాశ్మీరీ మిక్స్ కిలో రూ.350కి లభిస్తుందని ఆయన తెలిపారు.

ఇటీవలి అప్‌డేట్‌లో, ధర్మేష్ భాయ్ ఈ సంవత్సరం 50,000 కిలోగ్రాముల కారం పొడిని ఉత్పత్తి చేయాలనే తన అంచనాలను పంచుకున్నారు. ఆయన పొలంలోని కారంపొడి అమెరికా సహా వివిధ దేశాలకు చేరడం గమనార్హం. వార్షిక ఉత్పత్తి విలువ రూ. 1.50 కోట్లతో, ధర్మేష్ సంపాదన, వ్యవసాయ కూలీ వంటి ఖర్చులను తీసివేస్తే, మొత్తం రూ. 90 లక్షలు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..