
తమ క్రెడిట్ కార్డు కస్టమర్లకు హెచ్డీఎఫ్సీ షాకిచ్చింది. జులై 1వ తేదీ నుంచి కొత్త మార్పులను అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. పలు క్రెడిట్ కార్డులకు ప్రస్తుతం అందిస్తున్న బెనిఫిట్స్లో భారీగా కొత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్, క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్లలో మార్పులకు శ్రీకారం చుట్టింది. రెగాలియా గోల్డ్ క్రెడిట్ కార్డుకు సంబంధించి దేశీయ ఎయిర్పోర్టు లాంజ్ సౌకర్యం, రివార్డు పాయింట్లలో కొత విధించింది. అన్ని క్రెడిట్ కార్డులు ఇదే విధానాన్ని పాటిస్తుండగా.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కూడా అదే బాటలో నడుస్తోంది.
రెగాలియా గోల్డ్ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొత విధించింది. దేశంలోని ఎయిర్పోర్టుల్లో ఉచిత లాంజ్ సుదుపాయానికి ఆంక్షలు విధించింది. ఇక నుంచి కార్డు నుంచి నిర్ణీత మొత్తంలో ఖర్చు చేస్తేనే లాంజ్ సౌకర్యం కల్పిస్తారు. ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ నిర్దేశించిన పరిమితికి మంచి ఖర్చు చేస్తేనే.. తర్వాతి ఏడాదిలో ఉచిత లాంజ్ సదుపాయం కల్పిస్తారు. ప్రస్తుతం ఇస్తున్న వోచర్ ఆధారిత లాంజ్ యాక్సెస్ కూడా అందుబాటులో ఇక నుంచి ఉండదని హెచ్డీఎఫ్సీ స్పష్టం చేసింది. గడిచిన ఆర్ధిక సంవత్సరంలో రూ.60 వేలు ఖర్చు చేస్తే తర్వాతి ఏడాదిలో మూడు కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ పొందుతారు. ఎయిర్పోర్ట్ లాంజ్ వద్ద కార్డును స్కైప్ చేసి ఉచిత సదుపాయం పొందవచ్చు. జులై-సెప్టెంబర్ 2026 త్రైమాసికంలో ఒకవేళ లాంజ్ సౌకర్యం పొందాలనుకుంటే ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రూ.60 వేలు క్రెడిట్ కార్డు నుంచి ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ఇక రివార్డ్ పాయింట్ల విధానంలో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. అర్హత కలిగిన ట్రన్సాక్షన్లకు గాను ప్రతీ రూ. 150 ఖర్చుకు 4 రివార్డ్ పాయింట్లు ఇస్తున్నారు. ఇక రూ.200 ఖర్చుకు గాను 5 పాయింట్లు ఇస్తున్నారు. ఇక ఇండియాలో ఉండి వేరే దేశంలో నమోదు చేసుకున్న వ్యాపారులతో రూపాయల్లో జరిపే లావాదేవీలకు డీసీసీ రుసుంను 1.75 శాతానికి మార్చారు. మే 15వ తేదీ నుంచి రివార్డు పాయింట్ల విధానం అమల్లోకి వచ్చింది.