AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LPGపై కేంద్రం కీలక నిర్ణయం! రాష్ట్రాలకు సరఫరా 20 శాతం పెంపు

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం, పెరిగిన గ్యాస్ వినియోగం కారణంగా తలెత్తిన సంక్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోలియం శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రాలకు వాణిజ్య ఎల్‌పీజీ సరఫరాను 20 శాతం పెంచుతూ ఆదేశాలిచ్చింది. హోటళ్లు, రెస్టారెంట్లకు నిరంతర సరఫరా లక్ష్యంగా ఈ చర్య చేపట్టింది.

LPGపై కేంద్రం కీలక నిర్ణయం! రాష్ట్రాలకు సరఫరా 20 శాతం పెంపు
Lpg Cylinder
SN Pasha
|

Updated on: Mar 21, 2026 | 6:07 PM

Share

ఇరాన్‌, ఇజ్రాయెల్‌ యుద్ధం కారణంగా LPG కొరత అనే గందరగోళంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోలియం శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రాలకు కమర్షియల్ LPG సరఫరాను 20 శాతం పెంచుతూ తాజా ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం ద్వారా ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాలపై ఉన్న ఒత్తిడిని తగ్గించడమే లక్ష్యంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాస్తూ, కమర్షియల్ గ్యాస్ సరఫరా ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న రెస్టారెంట్లు, హోటళ్లు, డాబాలు వంటి వ్యాపార సంస్థలకు నిరంతరంగా LPG అందేలా చూడాలని సూచించింది. గ్యాస్ కొరత కారణంగా వ్యాపారాలు నిలిచిపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కూడా కేంద్రం పేర్కొంది.

ఇదే సమయంలో వలస కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా వలస కార్మికులకు ఉచితంగా 5 కేజీల LPG సిలిండర్లు అందించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపింది. ఇది తక్కువ ఆదాయం గల కుటుంబాలకు గ్యాస్ ఖర్చు భారాన్ని తగ్గించడంలో సహాయపడనుంది. ఇటీవలి కాలంలో గ్యాస్ వినియోగం పెరుగుతుండటం, సరఫరా గొలుసులో చోటు చేసుకుంటున్న సమస్యలు, అలాగే వ్యాపార రంగం నుంచి వస్తున్న డిమాండ్ పెరగడం వంటి అంశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సరఫరా పెంపుతో మార్కెట్‌లో స్థిరత్వం వస్తుందని, ధరలపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us