AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST Collections: ఏప్రిల్‌ నెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు.. ఎన్ని లక్షల కోట్లో తెలుసా?

GST Collections: అంతకుముందు ఫిబ్రవరిలో దేశీయ వనరుల నుండి రెండంకెల వసూళ్లు కారణంగా జీఎస్టీ పన్ను వసూళ్లు 9.1 శాతం పెరిగి రూ.183,646 కోట్లకు చేరుకున్నాయి. జనవరిలో జీఎస్టీ వసూళ్లు రూ.1.96 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇది గత ఏడాది ఇదే కాలం కంటే..

GST Collections: ఏప్రిల్‌ నెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు.. ఎన్ని లక్షల కోట్లో తెలుసా?
Subhash Goud
|

Updated on: May 01, 2025 | 4:31 PM

Share

కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ వసూళ్లు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. 2026 ఆర్థిక సంవత్సరం మొదటి నెలలోనే ప్రభుత్వం జీఎస్టీ వసూళ్ల పరంగా కొత్త రికార్డును సృష్టించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ప్రభుత్వ సేకరణ 12 శాతానికి పైగా వృద్ధిని సాధించింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. GST వసూళ్లు పెరగడానికి ప్రధాన కారణం ప్రభుత్వం పన్నులను తగ్గించి, నియమాలను సరళీకృతం చేయాలనే నిర్ణయం. రాబోయే రోజుల్లో ఈ సేకరణ మరింత పెరిగే అవకాశం ఉంది. 2026 ఆర్థిక సంవత్సరానికి రూ.17 లక్షల కోట్లకు పైగా పరోక్ష పన్నుల వసూలు లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. ఇందులో జీఎస్టీ వసూలు లక్ష్యం దాదాపు రూ.1.25 లక్షల కోట్లు. ఏప్రిల్ నెలలో GST వసూళ్లు ఎంత ఉన్నాయో తెలుసుకుందాం.

జీఎస్టీ వసూళ్లలో కొత్త రికార్డు:

ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. ఏప్రిల్ నెలలో భారతదేశ జీఎస్టీ వసూళ్లు 12.6 శాతం పెరిగి ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి రూ.2.37 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గత నెలలో భారతదేశ పరోక్ష పన్ను వసూళ్లు మార్చిలో వార్షిక ప్రాతిపదికన 9.9 శాతం పెరిగి రూ.1.96 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఏప్రిల్ 2024లో GST వసూళ్లు రూ.2.10 లక్షల కోట్లు – జూలై 1, 2017న పరోక్ష పన్ను విధానం అమలులోకి వచ్చిన తర్వాత ఇది రెండవ అత్యధిక వసూళ్లు. దేశీయ లావాదేవీల నుండి జీఎస్టీ ఆదాయం 10.7 శాతం పెరిగి దాదాపు రూ.1.9 లక్షల కోట్లకు చేరుకోగా, దిగుమతి చేసుకున్న వస్తువుల నుండి వచ్చే ఆదాయం 20.8 శాతం పెరిగి రూ.46,913 కోట్లకు చేరుకుంది. ఏప్రిల్ నెలలో జారీ చేసిన రీఫండ్లు 48.3 శాతం పెరిగి రూ.27,341 కోట్లకు చేరుకున్నాయి.

నాలుగు నెలల్లో ఎంత కలెక్షన్ వచ్చింది?

అంతకుముందు ఫిబ్రవరిలో దేశీయ వనరుల నుండి రెండంకెల వసూళ్లు కారణంగా జీఎస్టీ పన్ను వసూళ్లు 9.1 శాతం పెరిగి రూ.183,646 కోట్లకు చేరుకున్నాయి. జనవరిలో జీఎస్టీ వసూళ్లు రూ.1.96 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇది గత ఏడాది ఇదే కాలం కంటే 12.3 శాతం ఎక్కువ. అంటే ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటివరకు జీఎస్టీ వసూళ్లు రూ.8.13 లక్షల కోట్లకు చేరుకున్నాయి. డిసెంబర్‌లో జీఎస్టీ వసూళ్లు రూ.1.77 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 7.3% వృద్ధిని చూపుతోంది. పండుగ సీజన్ తర్వాత వినియోగం తగ్గడం వల్ల నవంబర్‌లో నమోదైన 8.5% వృద్ధి నుండి ఇది మందగమనం.

బడ్జెట్‌లో ప్రభుత్వం ఏం అంచనా వేసింది?

బడ్జెట్‌లో ప్రభుత్వం ఈ సంవత్సరానికి జీఎస్టీ ఆదాయంలో 11 శాతం వృద్ధిని అంచనా వేసింది. కేంద్ర జీఎస్టీ, పరిహార సెస్‌తో సహా వసూళ్లు రూ. 11.78 లక్షల కోట్లుగా అంచనా వేసింది. బడ్జెట్ డేటా ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం పరోక్ష పన్నుల వసూళ్లు రూ.17,35,100 కోట్లుగా ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో నుంచి ప్రభుత్వం జీఎస్టీ ద్వారా రూ.11,78,000 కోట్లు సమీకరించాలని అంచనా వేసింది. మొత్తం జీఎస్టీ ఆదాయంలో 86 శాతం సీజీఎస్టీ (రూ. 10,10,890 కోట్లు) నుంచి, 14 శాతం జీఎస్టీ పరిహార సెస్ (రూ. 1,67,110 కోట్లు) నుంచి వస్తుందని అంచనా.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి