
గురువారం (జనవరి 22) బంగారం, వెండి ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETFలు) బాగా తగ్గాయి. దీనికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ల్యాండ్పై సైనిక చర్య తీసుకోవడానికి నిరాకరించడమే. ఇది భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను తగ్గించింది. దీంతో సురక్షితమైన ఆస్తులకు డిమాండ్ తగ్గింది. వెండి ధరలు మొదట్లో బాగా పెరిగినప్పటికీ ట్రంప్ ప్రకటన తర్వాత ఉద్రిక్తతలు తగ్గాయి. బంగారం, వెండిపై పెట్టుబడులు తగ్గి, లాభాలను బుక్ చేసుకోవడం(అమ్మకాలు పెరగడం)తో ధరలు భారీగా తగ్గాయి.
గత కొన్ని వారాలుగా చాలా ETFలు వాటి NAV (నిజమైన విలువ) కంటే ఎక్కువగా ట్రేడవుతున్నాయి. ఉదాహరణకు ఒక ETF NAV రూ.100 ఉండి అది రూ.125 వద్ద ట్రేడవుతుంటే, ధర తరువాత రూ.102కి పడిపోతే, పెట్టుబడిదారుడు 18 శాతం నష్టాన్ని చూస్తాడు. అయితే నిజమైన విలువ కేవలం 2 శాతం మాత్రమే తగ్గినట్లు.
| టాటా సిల్వర్ ETF | -16.31 శాతం |
| ఆదిత్య బిర్లా సిల్వర్ ఇటిఎఫ్ | -13.74 శాతం |
| మిరే అసెట్ సిల్వర్ ETF | -12.61 శాతం |
| ఎడెల్వీస్ సిల్వర్ ETF | -12.28 శాతం |
| 360 వన్ సిల్వర్ ETF | -11.67 శాతం |
| నిప్పాన్ సిల్వర్ ETF | -11.08 శాతం |
| ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ సిల్వర్ ఇటిఎఫ్ | -10.52 శాతం |
| గ్రో సిల్వర్ ETF | -10.43 శాతం |
| జెరోధా సిల్వర్ ETF | -10.42 శాతం |
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి