Gold Price Today: పసిడి ప్రియులకు రిలీఫ్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Latest Prices: ప్రపంచవ్యాపంగా పసిడికి ఎల్లప్పుడూ డిమాండే ఉంటుంది. ఎలాంటి శుభకార్యాలున్నా, పండుగలున్నా చాలామంది బంగారం, వెండిని కొనుగోలు చేస్తుంటారు. అందుకే అందరూ బంగారం, వెండి ధరలపై దృష్టిసారిస్తుంటారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పలు పరిణామాల ప్రకారం..

Gold Price Today: పసిడి ప్రియులకు రిలీఫ్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Latest Gold Silver Prices

Updated on: Aug 27, 2023 | 6:28 AM

Gold and Silver Latest Prices: ప్రపంచవ్యాపంగా పసిడికి ఎల్లప్పుడూ డిమాండే ఉంటుంది. ఎలాంటి శుభకార్యాలున్నా, పండుగలున్నా చాలామంది బంగారం, వెండిని కొనుగోలు చేస్తుంటారు. అందుకే అందరూ బంగారం, వెండి ధరలపై దృష్టిసారిస్తుంటారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పలు పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు జరుగుతుంటాయి. ఇటీవల స్వల్ప హెచ్చుతగ్గులతో కొనసాగిన బంగారం, వెండి ధరలు తాజాగా.. స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.54,500 ఉంటే.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,450 గా ఉంది. కాగా.. వెండి కిలో ధర రూ. 76,400 లుగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో, దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు..

ఢిల్లీలో పది గ్రాముల బంగారం ధర రూ.54,650 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.59,600 లుగా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,500, 24 క్యారెట్లు రూ.59,450, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.54,800, 24 క్యారెట్లు రూ.59,780, బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.54,500, 24 క్యారెట్ల ధర రూ.59,450, కేరళలో 22 క్యారెట్ల ధర రూ.54,500, 24 క్యారెట్లు రూ.59,450 ఉంటే.. కోల్‌కతాలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,500, 24 క్యారెట్లు రూ.59,450 లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.54,500 లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.59,450 గా ఉండగా.. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,500, 24 క్యారెట్ల ధర రూ.59,450లుగా ఉంది.

ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.76,900 ఉండగా.. ముంబైలో కిలో వెండి ధర రూ.76,400 లుగా ఉంది. చెన్నైలో రూ.80,000, బెంగళూరులో వెండి ధర రూ.75,500లుగా ఉంది. కేరళలో రూ.80,000, కోల్‌కతాలో రూ.76,900 ఉంది. కాగా, హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.80,000 ఉండగా, విజయవాడ, విశాఖపట్నంలో కూడా రూ.80,000 లుగా కొనసాగుతోంది.

గమనిక.. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్‌లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. అయితే, ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది.. కావున, కొనేముందు ఒకసారి పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..