Gold Price Today: వరుసగా రెండు రోజులు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు తాజాగా మళ్లీ పెరిగాయి. అయితే గతంలో తగ్గిన ధర కంటే ప్రస్తుతం పెరిగిన ధర తక్కువగా ఉండడం బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. శుక్రవారంతో పోలీస్తే శనివారం తులం బంగారం ధర రూ. 170 వరకు పెరిగింది. దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..
* దేశరాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,850 ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ. 51,110 వద్ద కొనసాగుతోంది.
* ఢిల్లీలో బంగారం ధర పెరిగితే ముంబయిలో మాత్రం స్వల్పంగా తగ్గింది. శనివారం ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46,870 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,870 వద్ద ఉంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలోనూ గోల్డ్ రేట్ పెరిగింది. ఇక్కడ 22 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రూ. 45,060 ఉండగా, 24 క్యారెట్ల బంగారం రూ. 49,160 వద్ద కొనసాగుతోంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం రూ. 44,700 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 48,770 గా నమోదైంది.
* హైదరాబాద్లో శనివారం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 44,700 గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 48,770 వద్ద కొనసాగుతోంది.
* విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,700 వద్ద ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 48,770 గా ఉంది.
* విశాఖపట్నంలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 44,700 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 48,770 వద్ద కొనసాగుతోంది.
Stock Market: వారం రోజుల్లో రూ.10వేల పెట్టుబడికి రూ.15వేలు..లాభాల పంట పండిస్తున్న ఆ షేర్
Airtel Postpaid: పోస్ట్ పెయిడ్ ప్లాన్ ధరలను పెంచిన ఎయిర్టెల్..ఇకపై ఆ ప్లాన్లు ఉండవు.. ఎందుకంటే..