AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver: వెండి కొనాలంటే దండిగా డబ్బు కావాల్సిందేనా? భవిష్యత్తులో ఇంకా ఎంత పెరుగుతుందంటే..?

బంగారం ధర రూ.1.5 లక్షలు, వెండి రూ.3.23 లక్షలకు చేరి రికార్డు సృష్టించాయి. బలమైన దేశీయ డిమాండ్, అంతర్జాతీయ ధోరణులు ఈ పెరుగుదలకు కారణం. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం, ప్రపంచ అనిశ్చితి, పెట్టుబడిదారుల ఆసక్తితో భవిష్యత్తులో కూడా ధరలు పెరిగే అవకాశం ఉంది.

Silver: వెండి కొనాలంటే దండిగా డబ్బు కావాల్సిందేనా? భవిష్యత్తులో ఇంకా ఎంత పెరుగుతుందంటే..?
Silver
SN Pasha
|

Updated on: Jan 20, 2026 | 11:47 PM

Share

బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. బంగారం తొలిసారిగా రూ.1.5 లక్షలు దాటింది. స్వదేశంలో బలమైన డిమాండ్, స్థిరమైన ప్రపంచ ధోరణులు పెరుగుదలకు కారణంగా నిలిచాయి. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం.. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం అన్ని పన్నులతో సహా 10 గ్రాములకు రూ.5,100 పెరిగి రూ.1,53,200 వద్ద ట్రేడవుతోంది.

వెండి ధరలు కూడా బాగా పెరిగి స్థానిక మార్కెట్లో లైఫ్‌ టైమ్‌ రికార్డు ధరను తాకాయి. వెండి ధర దాదాపు 7 శాతం పెరిగి కిలోగ్రాముకు రూ.20,400 పెరిగి అన్ని పన్నులతో సహా రూ.3,23,000కి చేరుకుంది. అంతకు ముందు రోజే వెండి ధర రూ.10,000 పెరిగింది. కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా రూ.30,400 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ నుండి బలమైన సంకేతాలు ఈ ర్యాలీకి మద్దతు ఇచ్చాయి. forex.com నుండి వచ్చిన డేటా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మొదటిసారిగా స్పాట్ బంగారం ఔన్సుకు 4,700 డాలర్ల స్థాయిని దాటింది.

వెండి ధరలో కొనసాగిన పెరుగుదల

స్పాట్ సిల్వర్ కూడా విదేశాలలో తన పెరుగుదలను కొనసాగించింది. ఔన్సుకు 95.88 డాలర్ల తాజా రికార్డును తాకింది. బంగారం, వెండి ధరల పెరుగుదల ప్రపంచ అనిశ్చితిని, సురక్షితమైన ఆస్తులపై పెట్టుబడిదారుల నిరంతర ఆసక్తిని ప్రతిబింబిస్తుందని మార్కెట్ నిపుణులు తెలిపారు. కాగా వెండి ధరలు భవిష్యత్తులో కూడా పెరుగుతాయని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. రానున్న కాలంలో వెండి కొనాలంటే భారీగా డబ్బు ఖర్చు చేయకతప్పదని అంటున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి