Gold and Silver Price: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగురాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే

|

Aug 27, 2021 | 6:40 AM

Gold and Silver Price Today: పూర్వకాలం నుంచి భారతీయ మహిళకు బంగారానికి అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ ప్రజలు బంగారాన్ని ఒక ఆస్తిగా భావిస్తారు, ఇది ఒక తరం నుండి మరొక తరానికి అందజేయడమే కాకుండా..

Gold and Silver Price: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగురాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే
Gold And Silver
Follow us on

Gold and Silver Price Today: పూర్వకాలం నుంచి భారతీయ మహిళకు బంగారానికి అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ ప్రజలు బంగారాన్ని ఒక ఆస్తిగా భావిస్తారు, ఇది ఒక తరం నుండి మరొక తరానికి అందజేయడమే కాకుండా, ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో బంగారం తమను ఆదుకుంటుందని భావిస్తారు. అందుల్లనే బంగారంపై వివిధ రూపాయల్లో పెట్టుబడి పెడతారు. ముఖ్యంగా వివాహం, పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో బంగారం, వెండికి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. విలువైన లోహాన్ని నగలు, నాణేలుగా విక్రయిస్తారు. ఆభరణం లోహం ప్రధానంగా వ్యక్తిగత వినియోగం కోసం ఉపయోగించబడుతుంది.

కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత బంగారం, వెండి ధరలు చుక్కలను తాకాయి. అప్పటినుంచి ధరల్లో స్థిరత్వం ఏర్పడలేదు. ఒకరోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతూ.. అస్థిరంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పసిడి, వెండి లోహాలు పెట్టుబడి రూపంగా కూడా చూడబడుతుంది. స్వల్ప , దీర్ఘకాలం పాటు పెట్టుబడులకు అనువైన లోగా పరిగణిస్తున్నారు.

బంగారం రేట్లు ద్రవ్యోల్బణం అంతర్జాతీయంగా ధరలు మార్పు, కేంద్ర బ్యాంకుల బంగారం రిజర్వ్, వడ్డీ రేట్లు నిలకడలేని, నగల మార్కెట్లు సహా అనేక అంతర్జాతీయ అంశాలపై ప్రభావం ఇవి గ్లోబల్ గోల్డ్ రేట్లు ఆధారపడి ఉంటుంది. ఈరోజు ఆగస్టు 27 న తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు దేశంలోని వివిధ ముఖ్య నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం గ్రాము నిన్నటి ధర 4,435లు ఉండగా రూ. 15 తగ్గి ఈరోజు గ్రాము బంగారం ధర రూ. 4,420లకు చేరుకుంది. ఇక 10గ్రాముల బంగారం ధర నిన్న రూ. 44,350 ఉండగా రూ. 150 తగ్గి రూ. 44,200లకు చేరుకుంది.
మరోవైపు 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర నిన్న రూ. 4,838లు ఉండగా రూ. 16మేర తగ్గి ఈరోజు 4,822లకు చేరుకుంది. ఇక 10 గ్రాముల బంగారం ధర నిన్నటి నుంచి ఈరోజు రూ. 160 ల మేర తగ్గి ఆగస్టు 27 ఉదయానికి రూ. 48,220 నమోదైంది. ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విశాఖ, విజయవాడలో కొనసాగుతున్నాయి.

వెండి ధరలు: 

శుక్రవారం ఉదయానికి వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశంలో శుక్రవారం కిలో వెండి ధర రూ.63,200 లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధర రూ. 200మేర తగ్గింది.

Also Read:Collector Bungalow: జిలా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజ్‌కు తప్పిన పెను ప్రమాదం.. బంగ్లాపై కప్పు కూలిన వైనం..