Gold-Silver Price: స్వల్పంగా పెరిగిన బంగారం ధర, స్వల్పంగా తగ్గిన వెండి ధర .. ప్రధాన నగరాల్లో ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే

|

Aug 19, 2021 | 7:48 AM

Gold-Silver Price August 19th: ప్రాచీన కాలం నుండి భారతీయ మహిళకు బంగారానికి అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ ప్రజలు బంగారాన్ని ఒక ఆస్తిగా భావిస్తారు, ఇది ఒక తరం నుండి..

Gold-Silver Price: స్వల్పంగా పెరిగిన బంగారం ధర, స్వల్పంగా తగ్గిన వెండి ధర .. ప్రధాన నగరాల్లో ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే
Gold And Silver
Follow us on

Gold-Silver Price August 19th: ప్రాచీన కాలం నుండి భారతీయ మహిళకు బంగారానికి అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ ప్రజలు బంగారాన్ని ఒక ఆస్తిగా భావిస్తారు, ఇది ఒక తరం నుండి మరొక తరానికి అందజేయడమే కాకుండా, ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో బంగారం తమను ఆదుకుంటుందని భావిస్తారు. అందుల్లనే బంగారంపై వివిధ రూపాయల్లో పెట్టుబడి పెడతారు. ముఖ్యంగా వివాహం, పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో బంగారం, వెండికి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. విలువైన లోహాన్ని నగలు, నాణేలుగా విక్రయిస్తారు. ఆభరణం లోహం ప్రధానంగా వ్యక్తిగత వినియోగం కోసం ఉపయోగించబడుతుంది.

కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత బంగారం, వెండి ధరలు చుక్కలను తాకాయి. అప్పటినుంచి ధరల్లో స్థిరత్వం ఏర్పడలేదు. ఒకరోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతూ.. అస్థిరంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పసిడి, వెండి లోహాలు పెట్టుబడి రూపంగా కూడా చూడబడుతుంది. స్వల్ప , దీర్ఘకాలం పాటు పెట్టుబడులకు అనువైన లోగా పరిగణిస్తున్నారు.

బంగారం రేట్లు ద్రవ్యోల్బణం అంతర్జాతీయంగా ధరలు మార్పు, కేంద్ర బ్యాంకుల బంగారం రిజర్వ్, వడ్డీ రేట్లు నిలకడలేని, నగల మార్కెట్లు సహా అనేక అంతర్జాతీయ అంశాలపై ప్రభావం ఇవి గ్లోబల్ గోల్డ్ రేట్లు ఆధారపడి ఉంటుంది. ఈరోజు (ఆగస్ట్ 19) న తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు దేశంలోని వివిధ ముఖ్య నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం గ్రాము నిన్నటి ధర 4,430 లు ఉండగా రూ. 10 పెరిగి.. 4,430లకు చేరుకుంది. ఇక 10గ్రాముల బంగారం ధర నిన్న రూ. 44,200 ఉండగా వంద రూపాయలు పెరిగి ఆగస్ట్ 19న రూ. 44,300లు గా నమోదైంది.
మరోవైపు 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర నిన్న రూ. 4,822లు ఉండగా రూ. 11 పెరిగి ఈరోజు 4,833లకు చేరుకుంది. ఇక 10 గ్రాముల బంగారం ధర నిన్నటి నుంచి ఈరోజు రూ. 110లు పెరిగి ఆగస్టు 19న రూ. 48,220 నమోదైంది. ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విశాఖ, విజయవాడలో కొనసాగుతున్నాయి.

దేశంలో ప్రధాన నగరాలైన చెన్నై లో 22క్యారెట్ల బంగారం ధర రూ. 44,640 ఉండగా 24 క్యారెట్ల ధర రూ. 48,700లు గా ఉంది.

దేశ ఆర్ధిక రాజధాని ముంబై లో 22క్యారెట్ల బంగారం ధర రూ. 46,500 ఉండగా 24 క్యారెట్ల ధర రూ. 47,500లుగా నమోదైంది.

దేశ రాజధాని ఢిల్లీ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,450, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,660లు కొనసాగుతుంది.

వెండి ధర

గురువారం వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశంలో గురువారం కిలో వెండి ధర రూ. 68,200 లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధర రూ. 400 తగ్గింది.

 

Also Read:

ఈ రాశివారు సహనంతో వ్యవహరించాలి.. భార్య భర్తలు ఒకరిమీద ఒకరు నమ్మకం పెంచుకోవాలి..