Swiggy, Zomato: 5 శాతం జీఎస్టీ వసూలు చేయనున్న ఫుడ్‌ డెలివరీ సంస్థలు.. కస్టమర్లపై భారం పడుతుందా..?

|

Dec 22, 2021 | 10:57 AM

Swiggy Zomato: ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటో కీలక నిర్ణయం తీసుకున్నాయి. జనవరి 1 నుంచి జీఎస్టీని వసూలు చేయనుంది. ఈ సంస్థల యాప్స్‌ ద్వారా కస్టమర్ల..

Swiggy, Zomato: 5 శాతం జీఎస్టీ వసూలు చేయనున్న ఫుడ్‌ డెలివరీ సంస్థలు.. కస్టమర్లపై భారం పడుతుందా..?
Follow us on

Swiggy, Zomato: ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటో కీలక నిర్ణయం తీసుకున్నాయి. జనవరి 1 నుంచి జీఎస్టీని వసూలు చేయనుంది. ఈ సంస్థల యాప్స్‌ ద్వారా కస్టమర్ల ఫుడ్‌ ఆర్డర్లను చేస్తే 5 శాతం జీఎస్టీని వసూలు చేయనున్నాయి. గతంలో జీఎస్టీని రెస్టారెంట్ల నుంచి వసూల చేసేవి. ఇప్పుడు ఈ సంస్థలు నేరుగా వసూలు చేయనున్నాయి. జనవరి 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ జీఎస్టీ భారం కస్టమర్లకు పడబోదు. వినియోగదారులు ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తే రెస్టారెంట్లు ఐదు శాతం చొప్పున జీఎస్టీ వసూలు చేసేవి. స్విగ్గీ, జొమాటో కేవలం తమ సేవలకు గాను కొంత మొత్తం కస్టమర్ల నుంచి వసూలు చేసేవి.

ఈ విధానం వల్ల కొన్ని గుర్తింపు పొందని రెస్టారెంట్ల కారణంగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఈ కొత్త నిబంధన అమలు చేయబోతోంది. ఇప్పటి వరకు పన్ను చెల్లించని రెస్టారెంట్లు కూడా పన్ను పరిధిలోకి రానున్నాయి. ఈ నిర్ణయం కారణంగా కస్టమర్లకు ఎలాంటి భారం పడబోదు. సెప్టెంబర్‌ నెలలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. గుర్తింపులేని రెస్టారెంట్లు పన్ను పరిధిలో లేకపోవడం వల్ల రెండేళ్ల కాలంలో ప్రభుత్వానికి భారీగా నష్టం వాటిల్లింది. కేంద్ర తీసుకువచ్చిన ఈ కొత్త నిబంధన వల్ల కస్టమర్లకు ఎలాంటి భారం ఉండదనే విషయాన్ని అప్పట్లోనే కేంద్రం తెలిపింది.

ఇవి కూడా చదవండి:

LIC Jeevan Umang Policy: ఎల్‌ఐసీలో అదిరిపోయే స్కీమ్‌.. రూ.44 పెట్టుబడితో 27 లక్షల బెనిఫిట్‌.. పూర్తి వివరాలు

RBI Rules: డెబిట్‌, క్రెడిట్‌ కార్డు యూజర్లు అలర్ట్‌.. ఇక నుంచి ఆ వివరాలు ఉండవు.. జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు