Aadhaar: దేశంలో మొదటి ఆధార్‌ కార్డు ఎవరికిచ్చారు? ఆధార్‌ చరిత్ర ఏంటి? ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంది?

|

Sep 09, 2024 | 9:00 AM

History of Aadhaar Card in India: యూపీఏ ప్రభుత్వ హయాంలోనే ఆధార్ కార్డు అమల్లోకి వచ్చింది. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని ఆధార్ కార్డ్ ప్రాజెక్ట్‌కు నాయకత్వం వహించారు. ఆధార్ కార్డును ప్రవేశపెట్టినప్పటి నుండి దేశంలో చాలా పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయి. భారతదేశంలో ఒక వ్యక్తి గుర్తింపుకు ఆధార్ రుజువు. ఆధార్‌ వచ్చిన తర్వాత ప్రభుత్వ పనుల్లో..

Aadhaar: దేశంలో మొదటి ఆధార్‌ కార్డు ఎవరికిచ్చారు? ఆధార్‌ చరిత్ర ఏంటి? ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంది?
Aadhaar
Follow us on

History of Aadhaar Card in India: యూపీఏ ప్రభుత్వ హయాంలోనే ఆధార్ కార్డు అమల్లోకి వచ్చింది. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని ఆధార్ కార్డ్ ప్రాజెక్ట్‌కు నాయకత్వం వహించారు. ఆధార్ కార్డును ప్రవేశపెట్టినప్పటి నుండి దేశంలో చాలా పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయి. భారతదేశంలో ఒక వ్యక్తి గుర్తింపుకు ఆధార్ రుజువు. ఆధార్‌ వచ్చిన తర్వాత ప్రభుత్వ పనుల్లో కూడా మెరుగుదల కనిపించింది. ఆధార్ కార్డును చాలాసార్లు చూసినప్పటికీ, ప్రతి ఆధార్ కార్డు పైన స్పష్టంగా పేర్కొనబడిన UIDAI అనే పదం గురించి తెలిసిన వారు ఎవరూ ఉండరు.

UIDAI పూర్తి పేరు ఏంటి?

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ). ఇది ఆధార్ పథకం అమలుకు బాధ్యత వహించే భారత ప్రభుత్వ సంస్థ. ఇది ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద భారత ప్రభుత్వంచే 2016 సంవత్సరంలో ఏర్పడింది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉంది. భారతదేశంలోని ప్రధాన నగరాల్లో 8 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. దీని రెండు డేటా సెంటర్లు హెబ్బల్ (బెంగళూరు), మనేసర్ (గురుగ్రామ్)లో ఉన్నాయి. 2009లో యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆవిర్భవించినప్పటి నుంచి ఆధార్‌పై ప్రతిపక్ష పార్టీల దాడుల నుంచి సుప్రీంకోర్టులో పిటిషన్ల వరకు అనేక సవాళ్లు ఎదురయ్యాయి. అయితే 2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆధార్‌ అందుబాటులోకి వచ్చింది.

ఇది కూడా చదవండి: Savings Account Rules: మీ బ్యాంకు అకౌంట్లో పరిమితికి మించి డిపాజిట్లు చేస్తున్నారా? ట్యాక్స్‌ నోటీసులు రావచ్చు!

ఇవి కూడా చదవండి

ఆధార్ కార్డ్ చరిత్ర:

మార్చి 2006లో కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పేద కుటుంబాల కోసం ప్రత్యేక గుర్తింపు (UID) పథకాన్ని ఆమోదించింది. 2007లో జరిగిన మొదటి సమావేశంలో ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (EGOM) నివాసితుల డేటాబేస్‌ను రూపొందించాల్సిన అవసరాన్ని గుర్తించింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) 2009లో ప్రత్యేక గుర్తింపు సంఖ్యలను జారీ చేయడానికి ఏర్పాటు చేశారు. దాని మొదటి అధ్యక్షుడిగా నందన్ నీలేకని నియమితులయ్యారు.

గోప్యత మొదట

డిసెంబర్ 2010లో నేషనల్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (NIAI) బిల్లు, 2010 పార్లమెంటులో ప్రవేశపెట్టారు. కానీ ఒక సంవత్సరం తరువాత ఫైనాన్స్ స్టాండింగ్ కమిటీ దాని ప్రారంభ రూపంలో బిల్లును తిరస్కరించింది. పథకం కొనసాగడానికి ముందు ప్రైవసీ చట్టాలు, డేటా రక్షణ చట్టాలు అవసరమని సిఫార్సు చేసింది.

ఆధార్‌పై న్యాయపోరాటం:

కర్ణాటక హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి కెఎస్ పుట్టస్వామి 2012లో ఆధార్‌పై మొదటి చట్టపరమైన సవాలును దాఖలు చేశారు. ఇది సమానత్వం, గోప్యతకు సంబంధించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుందని పేర్కొన్నారు.

మధ్యంతర ఉత్తర్వులు:

2013లో ఒక మధ్యంతర ఉత్తర్వును జారీ చేసింది సుప్రీం కోర్టు. ఆధార్ కార్డు లేని కారణంగా ఎవరూ సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు తెలిపింది. అలాగే ఆగస్టు 2015లో ముగ్గురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు బెంచ్ ఆధార్ వినియోగాన్ని కొన్ని సంక్షేమ పథకాలకే పరిమితం చేసింది. ఆధార్ కార్డు లేని కారణంగా ఎవరూ లబ్ధి పొందకుండా చూడాలని ఆదేశించారు.

ఆధార్ తప్పనిసరి:

2016 మార్చిలో ప్రభుత్వం లోక్‌సభలో ఆధార్ (ఆర్థిక, ఇతర రాయితీలు, ప్రయోజనాలు, సేవల లక్ష్యంగా డెలివరీ) ప్రయోజనాల బిల్లును ప్రవేశపెట్టింది. పార్లమెంటు ఆమోదించిన బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. 2017 ప్రారంభంలో వివిధ మంత్రిత్వ శాఖలు సంక్షేమం, పెన్షన్, ఉపాధి పథకాలకు ఆధార్‌ను తప్పనిసరి చేశాయి. ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు ఆధార్‌ను తప్పనిసరి చేశారు.

దేశంలో మొదటి ఆధార్ కార్డు ఎవరికి వచ్చింది?

దేశంలో మొట్టమొదటి ఆధార్ కార్డ్ 28 జనవరి 2009న జారీ చేసింది కేంద్రం. ఆధార్ ప్రాజెక్ట్‌లో మొదటి ఆధార్ కార్డు మరాఠీ మహిళకు అందించారు. ఆమె పేరు రంజనా సోనావనే. ఆమె మహారాష్ట్రలోని టెంభలా అనే గ్రామ నివాసి.

ఇది కూడా చదవండి: Gold Price Today: మహిళలకు శుభవార్త.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి