Free Laptop: కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తోందా..?

Free Laptop: భారత ప్రభుత్వం అటువంటి పథకాన్ని ఏదీ ప్రకటించలేదు. వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని సేకరించే ఉద్దేశ్యంతో తరచుగా ఇలాంటి సందేశాలు వ్యాప్తి చెందుతాయి. అధికారిక వనరులతో ధృవీకరించుకోకుండా, తెలియని ఏ లింక్‌పైనా క్లిక్ చేయవద్దు లేదా అలాంటి సందేశాలను..

Free Laptop: కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తోందా..?
Free Laptop

Updated on: Jun 07, 2026 | 10:32 AM

PIB Fact Check: ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఒక సందేశం వైరల్ అవుతోంది. భారత ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేస్తుందని ఆ సందేశంలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ‘జాతీయ విద్యార్థి ల్యాప్‌టాప్ పథకం 2026’ కింద ఇది జరుగుతోందని కూడా ఆ సందేశంలో ఉంది. ఇప్పుడు ఈ పథకం వెనుక ఉన్న నిజాన్ని ప్రభుత్వమే వెల్లడించింది.

ఈ విషయం వెనుక ఉన్న నిజం ఏమిటి?

ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ వాస్తవ తనిఖీ సంస్థ అయిన పిఐబి ఫ్యాక్ట్ చెక్ ఈ వాదనపై ఒక పోల్‌ను ప్రారంభించింది. ఇది పూర్తిగా తప్పుడు వార్త అని పిఐబి స్పష్టం చేసింది. భారత ప్రభుత్వం అటువంటి పథకాన్ని ఏదీ ప్రకటించలేదు. పిఐబి అధికారిక ట్విట్టర్ ఖాతాలో పంచుకున్న ఒక పోస్ట్ ద్వారా ఈ వార్తలోని నిజం బయటపడింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: LPG Rules: ఎల్‌పీజీ కనెక్షన్లు ఉన్న వారికి బిగ్‌ అలర్ట్‌.. 30 రోజులు మాత్రమే గడువు.. లేకుంటే కనెక్షన్‌ కట్‌!

ఈ పోస్ట్ వైరల్ అవుతున్న మెసేజ్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసింది. దానిలో “FAKE” అని పెద్ద అక్షరాలతో ట్వీట్‌ చేసింది. ‘నేషనల్ స్టూడెంట్ ల్యాప్‌టాప్ స్కీమ్ 2026 కింద ప్రభుత్వం ఉచిత ల్యాప్‌టాప్‌ల కోసం దరఖాస్తులను స్వీకరిస్తోందని వాట్సాప్‌లో ఒక మెసేజ్ వైరల్ అవుతోందని, ఇది పూర్తిగా అబద్దమని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది.

భారత ప్రభుత్వం అటువంటి పథకాన్ని ఏదీ ప్రకటించలేదు. వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని సేకరించే ఉద్దేశ్యంతో తరచుగా ఇలాంటి సందేశాలు వ్యాప్తి చెందుతాయి. అధికారిక వనరులతో ధృవీకరించుకోకుండా, తెలియని ఏ లింక్‌పైనా క్లిక్ చేయవద్దు లేదా అలాంటి సందేశాలను ఫార్వార్డ్ చేయవద్దు. అప్రమత్తంగా ఉండండి.. అనుమానాస్పద కంటెంట్‌ను పీఐబీ ఫ్యాక్ట్ చెక్‌కు నివేదించండి అని పీఐబీ పేర్కొంది.

 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us