ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) పీఎఫ్ చందాదారుల కోసం అనేక ఆన్లైన్ సర్వీసులు అందుబాటులోకి తీసుకువస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుండటం వల్ల వివిధ పనుల నిమిత్తం పీఎఫ్ (పీఎఫ్) కార్యాలయానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి చేసుకునే సౌలభ్యం కల్పిస్తోంది. అయితే పీఎఫ్ నుంచి డబ్బులు విత్డ్రా చేయాలనుకునేవారు ఈ-నామినేషన్ నమోదు చేసుకోవడం తప్పనిసరి. ఈ-నామినేషన్ పూర్తి చేయకపోతే డబ్బులు విత్డ్రా చేసుకోలేరు. అందుకు పీఎఫ్ ఖాతాదారులు ఈ-నామినేషన్ పనిని పూర్తి చేసుకోవడం మంచిదని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు. అయితే చాలా మంది ఈ నామినేషన్ ఫైలింగ్ చేస్తున్నా.. అది పూర్తి కావడం లేదంటే అందుకు కారణాలను గమనించాల్సి ఉంటుంది. ప్రొఫైల్ను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ప్రొఫైల్ అప్డేట్ చేయకపోతే ఈ-నామినేషన్ పూర్తి చేయలేమనే విషయాన్ని గుర్తించుకోవాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి