EPFO: కోట్లాది మంది ఉద్యోగులకు షాక్‌.. ఆ ప్రతిపాదనను తిరస్కరించిన ప్రభుత్వం

|

Nov 05, 2022 | 7:09 AM

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) చందాదారుల పెన్షన్ పెంపు ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించింది. నిజానికి పీఎఫ్ చందాదారుల పెన్షన్ పెంచాలని..

EPFO: కోట్లాది మంది ఉద్యోగులకు షాక్‌.. ఆ ప్రతిపాదనను తిరస్కరించిన ప్రభుత్వం
'వివరాలను అందించండి' ట్యాబ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది, 'సేవ్ చేయి'పై క్లిక్ చేయండి. 'కుటుంబ వివరాలను జోడించు' ఎంపికపై క్లిక్ చేసి, నామినీ(ల)ని వివరాలను జోడించండి. 'నామినీ వివరాలు' ఎంపికపై క్లిక్ చేసి, నామినీ(ల) వాటాను పొందుపరచండి
Follow us on

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) చందాదారుల పెన్షన్ పెంపు ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించింది. నిజానికి పీఎఫ్ చందాదారుల పెన్షన్ పెంచాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. కానీ ఈ విషయంలో కార్మిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదనను ఆర్థిక మంత్రిత్వ శాఖ తిరస్కరించింది. పెన్షన్‌ను నెలకు రూ.1000 నుండి పెంచే ప్రతిపాదన పీఎఫ్‌ చందాదారుల ప్రస్తుత పెన్షన్‌ను నెలకు రూ.1,000 నుండి పెంచే ప్రతిపాదనను కార్మిక మంత్రిత్వ శాఖ అందించింది. దీనికి సంబంధించి పార్లమెంటరీ కమిటీ ఆర్థిక మంత్రిత్వ శాఖను వివరణ కోరనుంది.

కార్మిక మంత్రిత్వ శాఖ, ఈపీఎఫ్‌వో ఉన్నత అధికారులు బీజేడీ ఎంపీ భర్తిహరి మహతాబ్ నేతృత్వంలోని లేబర్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి ఈపీఎఫ్‌ పెన్షన్ స్కీమ్, దాని నిధుల నిర్వహణ గురించి తెలియజేశారు. నెలవారీ పింఛను పెంపునకు సంబంధించి కార్మిక శాఖ చేసిన ప్రతిపాదనకు ఆర్థిక శాఖ అంగీకరించలేదని అధికారులు కమిటీకి తెలిపారు.

దీనికి సంబంధించి వివరణ కోరేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులను పిలిపించాలని కమిటీ ఇప్పుడు నిర్ణయించింది. కమిటీ తన నివేదికలో సభ్యుడు, వితంతువు పింఛనుదారునికి చెల్లించాల్సిన కనీస నెలవారీ పెన్షన్‌ను కనీసం రూ.2,000 పెంచాలని సిఫారసు చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి