Air Travel: విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. పేపర్‌లెస్‌ ప్రయాణం.. ఎయిర్ ట్రావెల్ కోసం బీటా వెర్షన్

Air Travel: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా డిజియాత్ర యాప్ బీటా వెర్షన్ భారతదేశంలో విడుదలైంది. బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం, ఢిల్లీ అంతర్జాతీయ..

Air Travel: విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. పేపర్‌లెస్‌ ప్రయాణం.. ఎయిర్ ట్రావెల్ కోసం బీటా వెర్షన్
Air Travel

Updated on: Aug 15, 2022 | 9:38 PM

Air Travel: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా డిజియాత్ర యాప్ బీటా వెర్షన్ భారతదేశంలో విడుదలైంది. బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం, ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం కోసం తాజా బీటా వెర్షన్ విడుదల చేశారు. అమృత్ ఫెస్టివల్ ఆఫ్ ఇండిపెండెన్స్‌తో పాటు, కాంటాక్ట్‌లెస్, పేపర్‌లెస్ విమాన ప్రయాణ రంగంలో కూడా భారతదేశం ముందడుగు వేసింది. అంటే రెండు ప్రాంతాల మధ్య దేశీయ విమానంలో ప్రయాణించే ప్రయాణికులకు ఎలాంటి కాగితం అవసరం ఉండకుండానే ప్రయాణం చేయవచ్చు. ఈ-గేట్ బోర్డింగ్ సిస్టమ్ ద్వారా తమ విమాన ప్రయాణాన్ని పూర్తి చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రయాణికులు బయోమెట్రిక్ వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుంది.

బెంగుళూరు, ఢిల్లీలో సర్వీస్ ప్రారంభం

ప్రస్తుతం బెంగుళూరు, ఢిల్లీ విమానాశ్రయాల్లో డిజియాత్ర బోర్డింగ్ సిస్టమ్, ఇ-గేట్ ప్రారంభం అయ్యాయి. అయితే ఈ సర్వీస్ దేశంలోని అన్ని దేశీయ విమానయాన సంస్థలకు దశలవారీగా ప్రారంభించనున్నారు. ఎలాంటి పేపర్‌ లేకుండానే బయోమెట్రిక్‌ ద్వారా ధృవీకరణ పొంది చెక్-ఇన్, సెక్యూరిటీ చెక్ తర్వాత వారు విమానంలో ఎక్కాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us