Budget 2022: పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం..వర్క్ ఫ్రమ్ హోమ్ పై బడ్జెట్‌కు ముందు కార్మిక మంత్రిత్వ శాఖ చర్చలు

|

Jan 17, 2022 | 11:20 PM

కేంద్ర బడ్జెట్ 2022(Budget 2022)కి ముందు, వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకానికి సంబంధించిన సమస్యలను చర్చించడానికి కార్మిక .. ఉపాధి మంత్రిత్వ శాఖ పరిశ్రమల ముఖ్యులతో సమావేశమైంది.

Budget 2022: పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం..వర్క్ ఫ్రమ్ హోమ్ పై బడ్జెట్‌కు ముందు కార్మిక మంత్రిత్వ శాఖ చర్చలు
Budget 2022
Follow us on

కేంద్ర బడ్జెట్ 2022(Budget 2022)కి ముందు, వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకానికి సంబంధించిన సమస్యలను చర్చించడానికి కార్మిక .. ఉపాధి మంత్రిత్వ శాఖ పరిశ్రమల ముఖ్యులతో సమావేశమైంది. ఈ సమావేశానికి కంపెనీల ముఖ్య కార్యనిర్వహణాధికారులు (CEOs) .. మానవ వనరుల శాఖ హాజరైనట్లు జీ బిజినెస్ అంబరీష్ పాండే వెల్లడించారు.

తయారీ, హోటల్, నిర్మాణ, సిబ్బంది, ఆటోమొబైల్ పరిశ్రమల ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఉపాధి పెంపు అంశంపై చర్చలు జరిగాయి. అంతేకాకుండా మెరుగైన పని వాతావరణం గురించి, మహిళల భద్రతకు సంబంధించిన సూచనలను సమావేశంలో అక్కడికక్కడే తీసుకున్నారు. అదేవిధంగా వర్క్ ఫ్రమ్ స్కీమ్ (WFH), EPFO, ESIC అందించిన సౌకర్యాలను మెరుగుపరచడంపై కూడా మంత్రిత్వ శాఖ పరిశ్రమల వర్గాల నుంచి సలహాలు స్వీకరించింది. సమావేశానికి హాజరైన పరిశ్రమల ప్రతినిధులు పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం వంటి పథకాలకు సంబంధించి మంత్రిత్వ శాఖకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంలో, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల సన్నద్ధతను సమీక్షించేందుకు, 2022 జనవరి 12న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలతో సమన్వయ సమావేశానికి కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి సునీల్ బర్త్వాల్ అధ్యక్షత వహించారు. మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకారం సాధారణంగా కార్మికులకు .. ముఖ్యంగా వలస కార్మికులకు గౌరవం. అదనపు ముఖ్య కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, రాష్ట్ర కార్మిక శాఖల కార్యదర్శులు .. అన్ని రాష్ట్రాలు/యుటిల లేబర్ కమిషనర్లు .. రైల్వే మంత్రిత్వ శాఖ .. ఆహార .. ప్రజా పంపిణీ శాఖ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న కొన్ని రాష్ట్రాలు/యూటీలలో రాత్రిపూట కర్ఫ్యూలు .. వారాంతపు కర్ఫ్యూలను మినహాయించి, దేశంలో నిర్మాణ కార్యకలాపాలు, వ్యాపార కార్యకలాపాలు, దుకాణాలు .. పారిశ్రామిక కార్యకలాపాలపై ఎటువంటి పరిమితులు లేవని రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేసాయి. ఇప్పటివరకు, ప్రభుత్వాలు విధించిన పరిమిత పరిమితుల కారణంగా వలస కార్మికుల అసాధారణ కదలికలకు సంబంధించి ఎటువంటి సమస్యా లేదని ఆయా రాష్ట్రాల ప్రభుత్వ వర్గాలు ఈ సందర్భంగా పేర్కొన్నాయి.

ఇవి కూడా చదవండి: Corona: కరోనా టెర్రర్‌.. ఢిల్లీ, ముంబైలలో త్వరలో పీక్ స్టేజ్..! 8 రోజులుగా దేశంలో రోజుకు లక్షకు పైగా కొత్త కేసులు..

Letter war: టీఆర్ఎస్-బీజేపీ లెటర్ వార్.. మొన్న మోడీకి సీఎం కేసీఆర్ లేఖ.. కౌంటర్‌గా కేసీఆర్‌కు బండి సంజయ్ లెటర్!