Budget 2022: రాబోయే బడ్జెట్ కరోనా బాధితులకు హాస్పిటల్ ఖర్చులపై పన్ను మినహాయింపు వస్తుందా? నిపుణులు ఏమంటున్నారంటే..

|

Jan 24, 2022 | 10:36 PM

రాబోయే  ఆర్థిక సంవత్సరం 2022-23 కోసం బడ్జెట్(Budget 2022) సమర్పణకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. వచ్చే నెల ఫిబ్రవరి 1న, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) తదుపరి బడ్జెట్‌ను సమర్పించవచ్చు.

Budget 2022: రాబోయే బడ్జెట్ కరోనా బాధితులకు హాస్పిటల్ ఖర్చులపై పన్ను మినహాయింపు వస్తుందా? నిపుణులు ఏమంటున్నారంటే..
Budget 2022
Follow us on

రాబోయే  ఆర్థిక సంవత్సరం 2022-23 కోసం బడ్జెట్(Budget 2022) సమర్పణకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. వచ్చే నెల ఫిబ్రవరి 1న, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitaraman) తదుపరి బడ్జెట్‌ను సమర్పించవచ్చు. ఇది ఆమెకు నాలుగో బడ్జెట్‌. ఈ సాధారణ బడ్జెట్‌పై సాధారణ అంచనాల నుంచి ప్రత్యేక అంచనాల వరకు ఉన్నాయి. ఈసారి కూడా, కరోనా మహమ్మారి నీడలో బడ్జెట్‌ను సమర్పించనున్నారు కాబట్టి, కరోనా రోగులు .. వారి కుటుంబాల కోసం ఆర్థిక మంత్రి కొన్ని ప్రకటనలు చేయవచ్చని భావిస్తున్నారు.

కరోనా మహమ్మారి కారణంగా, చాలా మంది ఉపాధి కోల్పోయారు .. కొంతమంది ఆదాయాలు తగ్గాయి, కాబట్టి సాధారణ ప్రజలు ఆర్థిక మంత్రి వైపు చాలా అంచనాలతో చూస్తున్నారు. రాబోయే బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నుంచి కరోనా రోగులు .. వారి కుటుంబాలు ఏమి ఆశిస్తున్నారు .. వారికి ఎలా ఉపశమనం ఇవ్వవచ్చు అనే దాని గురించి ఆర్ధిక నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

ఇవి 2022 బడ్జెట్ గురించిన అంచనాలు

కరోనా మహమ్మారి సమయంలో, చాలా మంది కరోనా రోగులు .. వారి కుటుంబాలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, కంపెనీలు, స్నేహితులు .. సామాజిక కార్యకర్తల నుంచి ఆర్థిక సహాయం పొందాయి. అయితే, చాలా మంది ప్రజలు ఈ మొత్తం యుద్ధంలో తమంతట తాముగా పోరాడవలసి వచ్చింది. దీనికి సంబంధించి, కరోనా చికిత్సకు అయ్యే ఖర్చులపై మినహాయింపు ప్రయోజనాన్ని కరోనా బాధితులకు ఇవ్వడాన్ని ప్రభుత్వం పరిగణించవచ్చని పన్ను నిపుణులు భావిస్తున్నారు. వారు చెబుతున్న దాని ప్రకారం ప్రభుత్వం జూన్ 25, 2021 తేదీన ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసిందని, దీని కింద కంపెనీ లేదా మరే ఇతర వ్యక్తి నుంచి చికిత్స కోసం పొందిన సహాయంపై ఆదాయపు పన్ను మినహాయింపును అందించడం జరుగుతుందని తెలియజేశారు. దీని ప్రకారం కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన పన్ను చెల్లింపుదారుల కుటుంబాలు తమ కంపెనీ నుంచి పొందే ఆర్థిక సహాయంపై ఎటువంటి పరిమితి లేకుండా మినహాయింపు పొందుతారు .. ఈ ఆర్థిక సహాయం మరే ఇతర వ్యక్తి నుంచి అయినా స్వీకరించినట్లయితే, మొత్తం రూ. 10 లక్షలపై మినహాయింపు లభిస్తుంది. ఇందుకు అవసరమైన చట్ట సవరణలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నప్పటికీ ఇంతవరకు జరగలేదు. అటువంటి పరిస్థితిలో, కేంద్ర ఆర్థిక మంత్రి దీనికి సంబంధించి రాబోయే బడ్జెట్‌లో అవసరమైన సవరణలను ప్రకటించవచ్చు.

సీనియర్ సిటిజన్లు ఆదాయపు పన్ను సెక్షన్ 80డి కింద రూ. 50,000 వరకు మినహాయింపు పొందుతారు. అయితే, వారు ఎటువంటి ఆరోగ్య బీమా పరిధిలోకి రాకపోతే మాత్రమే ఈ ప్రయోజనం పొందుతారు. కరోనా ఇన్‌ఫెక్షన్‌కు సంబంధించి తాము లేదా వారి కుటుంబంలోని ఎవరికైనా చికిత్స కోసం ఖర్చు చేసిన అన్ని వయసుల వారికి సెక్షన్ 80డి కింద మినహాయింపు ప్రయోజనాన్ని ఇవ్వడాన్ని ఆర్థిక మంత్రి పరిగణించాలని నిపుణులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Budget 2022: వారిపై తగ్గనున్న పన్ను భారం.. స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిపై బడ్జెట్‌లో కీలక ప్రకటన?

Budget 2022: పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం..వర్క్ ఫ్రమ్ హోమ్ పై బడ్జెట్‌కు ముందు కార్మిక మంత్రిత్వ శాఖ చర్చలు