
దేశ ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ( BSNL ) తమ యూజర్స్ కోసం దీపావళికి ప్రత్యేక ఆఫర్ను ప్రారంభించింది. కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు బీఎస్ఎన్ఎల్ ఈ సరికొత్త ఆఫర్ను పరిచయం చేసింది. ఈ ఆఫర్లో భాగంగా కొత్త కస్టమర్లు ఇప్పుడు కేవలం రూ.1 పెట్టి కొత్త సిమ్ కొంటే ఒక నెల పాలు ఉచిత 4G మొబైల్ డేటాను పొందవచ్చు. ఈ దీపావళి బొనాంజా ఆఫర్ అక్టోబర్ 15 నుండి నవంబర్ 15, 2025 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్లో అన్లిమిటేడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2GB హై-స్పీడ్ డేటా, రోజుకు 100 SMS ను పొందవచ్చు.
ఈ ఆఫర్ ముగిసిన తర్వాత కూడా కస్టమర్లు బీఎస్ఎన్ఎల్తోనే ఉండేలా మా నెట్వర్క్ పనిచేస్తుందని BSNL చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ A. రాబర్ట్ J. రవి అన్నారు. ఈ దీపావళి బోనస్ మా 4G నెట్వర్క్ను యూజ్ చేసే కస్టమర్లకు గర్వాన్ని అందిస్తుందన్నారు. ఈ సేవ నాణ్యత వారిని ఎల్లకాలంలో మాతోనే ఉంచేందుకు సహాయపడుతుందన్నారు.
మీరు బీఎస్ఎన్ఎస్కు కొత్త కస్టమర్ అయితే అక్టోబర్ 15, నవంబర్ 15 మీరు ఈ ఆఫర్ను పొందవచ్చు. అందుకోసం మీరు మీ దగ్గర్లోని BSNL స్టోర్కు వెళ్లి రూ.1 పెట్టి కొత్త సిమ్ కార్డు తీసుకొండి. ఆ సిమ్ కార్డు నంబర్ 15లోపు యాక్టీవేట్ అయితే మీరు ఈ ఆఫర్ను పొందవచ్చు.