BSNL 5G: బీఎస్‌ఎన్‌ఎల్‌ 5జీ ఎప్పుడు వస్తుందో తెలుసా? క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి

BSNL 5G: సెప్టెంబర్ 27న, దేశవ్యాప్తంగా 92,564 టవర్లలో 4G ప్రారంభించింది. వేగం నుండి నెట్‌వర్క్ స్థిరత్వం వరకు ఇది అసాధారణంగా బాగా పనిచేస్తోంది. ఢిల్లీ NCRలోని అనేక ప్రాంతాలలో దీని వేగాన్ని పరీక్షించారు. సగటు వేగం 40-50 Mbps. ప్రభుత్వం..

BSNL 5G: బీఎస్‌ఎన్‌ఎల్‌ 5జీ ఎప్పుడు వస్తుందో తెలుసా? క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి

Updated on: Oct 08, 2025 | 9:40 PM

సెప్టెంబర్ 27న తన 4G నెట్‌వర్క్‌ను ప్రారంభించిన తర్వాత దేశ ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL), ఇప్పుడు తన 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించనుంది. ఈ సమాచారాన్ని కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్వయంగా అందించారు. BSNL తన 5G నెట్‌వర్క్‌ను ఎప్పుడు ప్రారంభిస్తుందో ఆయన వెల్లడించడమే కాకుండా తన సొంత 4G టెక్నాలజీతో భారతదేశం ఇప్పుడు గతంలో ఐదు అంతర్జాతీయ కంపెనీలను మాత్రమే కలిగి ఉన్న ఎలైట్ క్లబ్‌లో చేరిందనే విషయాన్ని కూడా పంచుకున్నారు. ఇప్పటివరకు, 4G టెక్నాలజీలో స్వీడన్, ఫిన్లాండ్, దక్షిణ కొరియా, చైనా కంపెనీలు ఆధిపత్యం చెలాయించాయని, కానీ ఇప్పుడు భారతదేశం కూడా వాటిలో చేరిందని గమనించాలి.

ఇది కూడా చదవండి: School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. దీపావళికి భారీగా సెలవులు.. ఎన్ని రోజులో తెలుసా?

సొంత టెక్నాలజీతో 4జీ

తన సొంత 4G టెక్నాలజీతని అందుబాటులోకి తీసుకువచ్చింది కేంద్రం. భారతదేశం 4G టెక్నాలజీపై గుత్తాధిపత్యం కలిగి ఉన్న కంపెనీల సమూహంలో చేరింది. దీని గురించి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ, భారతదేశం తన స్వదేశీ సాంకేతికత ద్వారా ఈ రంగంలో కొత్త ప్రమాణాన్ని నిర్దేశించిందని అన్నారు. రాబోయే ఆరు నుండి ఎనిమిది నెలల్లో అన్ని BSNL 4G టవర్లను 5Gకి అప్‌గ్రేడ్ చేస్తామని ఆయన అన్నారు. ఇది భారతదేశంలో ఎండ్-టు-ఎండ్ 5G నెట్‌వర్క్‌ను అనుమతిస్తుంది. సెప్టెంబర్ 27న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా 92,564 4G టవర్లను ప్రారంభించడం గమనించదగ్గ విషయం.

ఇవి కూడా చదవండి

4G పనితీరు ఎలా ఉంది?

సెప్టెంబర్ 27న, దేశవ్యాప్తంగా 92,564 టవర్లలో 4G ప్రారంభించింది. వేగం నుండి నెట్‌వర్క్ స్థిరత్వం వరకు ఇది అసాధారణంగా బాగా పనిచేస్తోంది. ఢిల్లీ NCRలోని అనేక ప్రాంతాలలో దీని వేగాన్ని పరీక్షించారు. సగటు వేగం 40-50 Mbps.

ఈ ఏడాది చివరి నాటికి 5G?

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రభుత్వం BSNL 4G కోసం సెప్టెంబర్ 2025 గడువును నిర్ణయించింది. సెప్టెంబర్ చివరి నాటికి BSNL 4Gని ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. అందువల్ల ఈ సంవత్సరం చివరి నాటికి రెండు ప్రధాన నగరాల్లో BSNL 5G ప్రారంభించబడే అవకాశం ఉంది. అలాగే కొన్ని నెలల తర్వాత దేశంలోని మిగిలిన ప్రాంతాలలో కూడా ప్రారంభం కానుంది. ఎందుకంటే కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల చేసిన ప్రకటనలో ఈ సంవత్సరం చివరి నాటికి BSNL 5G ప్రారంభం కానుంది. ఈ సంవత్సరం చివరి నాటికి ఢిల్లీ, ముంబైలలో BSNL 5G ప్రారంభించే అవకాశం కూడా ఉంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇ‍క్కడ క్లిక్‌ చేయండి

Follow Us