AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bis Raids: అమెజాన్-ఫ్లిప్‌కార్ట్‌లో నకిలీ ఉత్పత్తులు.. బీఐఎస్‌ దాడులు.. వేలాది వస్తువులు సీజ్!

Bis Raids: బీఐఎస్‌ చట్టం, 2016 ప్రకారం.. అన్ని వినియోగదారు ఉత్పత్తులు ధృవీకరించడం తప్పనిసరి. కానీ ధృవీకరించని ఉత్పత్తులు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో, మైంట్రా, బిగ్‌బాస్కెట్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో నిరంతరం అమ్ముడవుతున్నాయి. ఈ కారణంగా బీఐఎస్‌ కఠినమైన చర్యలు తీసుకుంది. మార్కెట్‌ను పర్యవేక్షిస్తున్నామని, భవిష్యత్తులో వినియోగదారులకు..

Bis Raids: అమెజాన్-ఫ్లిప్‌కార్ట్‌లో నకిలీ ఉత్పత్తులు.. బీఐఎస్‌ దాడులు.. వేలాది వస్తువులు సీజ్!
Subhash Goud
|

Updated on: Mar 17, 2025 | 3:38 PM

Share

భారతదేశంలో నకిలీ, ప్రామాణికం కాని ఉత్పత్తుల అమ్మకాలను నిషేధించడానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) కీలక అడుగు వేసింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రధాన ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల గిడ్డంగులపై దాడులు చేసి వేలాది ధృవీకరించని ఉత్పత్తులను స్వాధీనం చేసుకుంది, ప్రభుత్వం ప్రకారం, వినియోగదారులకు సురక్షితమైన, ధృవీకరించని ఉత్పత్తులను అందించే లక్ష్యంతో ఈ చర్య తీసుకుంది.

ఏ నగరాల్లో దాడులు జరిగాయి?

మార్చి 7న లక్నో, గురుగ్రామ్, ఢిల్లీలోని ఈ-కామర్స్ గిడ్డంగులపై BIS దాడులు నిర్వహించిందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది. లక్నోలోని అమెజాన్ గిడ్డంగి నుండి 215 బొమ్మలు, 24 హ్యాండ్ బ్లెండర్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని బీఐఎస్‌ సర్టిఫికేషన్ లేకుండా విక్రయిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఫిబ్రవరి 2025లో గురుగ్రామ్‌లోని అమెజాన్ గిడ్డంగిపై జరిగిన దాడిలో 58 అల్యూమినియం ఫాయిల్స్, 34 మెటాలిక్ వాటర్ బాటిళ్లు, 25 బొమ్మలు, 20 హ్యాండ్ బ్లెండర్లు, 7 పివిసి కేబుల్స్, 2 ఫుడ్ మిక్సర్లు, 1 స్పీకర్‌ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఫ్లిప్‌కార్ట్ గురుగ్రామ్ గిడ్డంగి (ఇన్‌స్టాకార్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్)పై జరిగిన దాడిలో సర్టిఫికెట్లు లేని 534 స్టెయిన్‌లెస్ స్టీల్ బాటిళ్లు, 134 బొమ్మలు, 41 స్పీకర్లు స్వాధీనం చేసుకున్నారు.

BIS దర్యాప్తులో టెక్విజన్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ధృవీకరించని ఉత్పత్తులు సరఫరా చేస్తున్నట్లు తేలింది. దీని తరువాత ఢిల్లీలోని టెక్విజన్ రెండు గిడ్డంగులపై దాడులు నిర్వహించింది. అక్కడ నుండి 7,000 ఎలక్ట్రిక్ వాటర్ హీటర్లు, 4000 ఎలక్ట్రిక్ ఫుడ్ మిక్సర్లు, 95 ఎలక్ట్రిక్ రూమ్ హీటర్లు, 40 గ్యాస్ స్టవ్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ స్వాధీనం చేసుకున్న ఉత్పత్తులలో డిజిస్మార్ట్, యాక్టివా, ఇనల్సా, సెల్లో స్విఫ్ట్, బటర్‌ఫ్లై వంటి బ్రాండ్లు ఉన్నాయి.

BIS ఈ చర్య ఎందుకు తీసుకుంది?

బీఐఎస్‌ చట్టం, 2016 ప్రకారం.. అన్ని వినియోగదారు ఉత్పత్తులు ధృవీకరించడం తప్పనిసరి. కానీ ధృవీకరించని ఉత్పత్తులు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో, మైంట్రా, బిగ్‌బాస్కెట్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో నిరంతరం అమ్ముడవుతున్నాయి. ఈ కారణంగా బీఐఎస్‌ కఠినమైన చర్యలు తీసుకుంది. మార్కెట్‌ను పర్యవేక్షిస్తున్నామని, భవిష్యత్తులో వినియోగదారులకు సురక్షితమైన, ధృవీకరించని ఉత్పత్తులను అందించడానికి ఇటువంటి చర్య కొనసాగుతుందని మంత్రిత్వ శాఖ చెబుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి